Switch to English

ప్రాణం తీసిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా.! తప్పెవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,201FansLike
57,764FollowersFollow

ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా ఉంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబం, ‘పుష్ప 2 ది రూల్’ సినిమా చూసేందుకు వెళ్ళగా, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా తల్లి ప్రాణాలు కోల్పోయారు.

అసలు సినిమాకి ప్రీమియర్స్ ఎందుకు.? పెయిడ్ ప్రీమియర్స్‌తో ఏం సాధించాలనుకుంటున్నారు.? ఈ చర్చ ఇప్పటిది కాదు.. చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమే. తమ సినిమాపై అపారమైన నమ్మకంతో, ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం అన్నది సర్వసాధారణమైపోయింది.

ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి ప్రముఖుల రాక ఎందుకో తెలుసు కదా.? ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి.. తద్వారా హైప్ పెంచడానికి. సినిమా ప్రమోషన్‌లో భాగమే ఇదంతా. కానీ, ప్రేక్షకుల భద్రత సంగతేంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.

సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాట.. అనేది దాదాపు ప్రతి పెద్ద సినిమాకీ సర్వసాధారణమే. కాకపోతే, ప్రాణాపాయం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ‘పుష్ప 2 ది రూల్’ సినిమా విషయానికొస్తే, హైద్రాబాద్‌లోని ఓ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఓ మహిళ ప్రాణాల్ని తీసేసింది.

ముందస్తు సమాచారం లేకుండా, సినీ నటుడు అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్‌కి వెళ్ళడమే ఈ తొక్కిసలాటకి కారణమని సాక్షాత్తూ పోలీసులు వెల్లడించారు. ప్రీమియర్ షో నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశామనీ, తమకు సైతం సినీ నటుడు అల్లు అర్జున్ సమాచారమివ్వకపోవడంతో, అతని చూసేందుకు సినీ అభిమానులు ఒక్కసారిగా ఎగబడేసరికి తొక్కిసలాట జరిగిందని పోలీసులు వివరించారు.

అంతే కాదు, అల్లు అర్జున్ మీద కేసు నమోదయ్యింది. థియేటర్ యాజమాన్యం కూడా ఈ ఘటనలో బాధ్యత తీసుకోవాల్సి వుంది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం అనేది సాధారణంగా జరిగేదే.! కానీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న ఇక్కడ.

ప్రీమియర్ షోలు వేయడం అనేది నిర్మాత ఇష్టం. సినిమా ప్రమోషన్ కోసం రకరకాల పబ్లిసిటీ స్టంట్లూ మామూలే.! కానీ, సినిమా కంటే ప్రాణం చాలా చాలా విలువైనది కదా.! తాజా ఘటన, అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ బ్లాక్ మార్క్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బాధిత కుటుంబానికి తీరని వ్యధ.

పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రీమియర్స్ పేరుతో అనవసర హంగామా ఇకనైనా తగ్గాల్సి వుంది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన పుష్ప, డిసెంబర్ 5న అధికారికంగా విడుదలయ్యింది. కానీ, అంతకన్నా ముందు రోజే.. అంటే, డిసెంబర్ 4న ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.

అర్థరాత్రి ప్రదర్శనలనే కాన్సెప్ట్ కూడా అనవసర ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా, ఆ ప్రీమియర్స్ కూడా సరైన సమయాల్లోనే పడితే కొంతవరకు ప్రమాదాల్ని నివారించే అవకాశం వుంటుందేమో.. అన్న వాదనా లేకపోలేదు.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

ఎక్కువ చదివినవి

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచి నెగటివ్...

Daily Horoscope: కన్యకు ఉద్యోగ లాభం, మకరానికి ఆర్థిక స్థిరత్వం

జనవరి 16, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పనిలో ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...