Switch to English

మెగాస్టార్ చిరంజీవి వైసీపీ వైపా.? బీజేపీ వైపా.? జనసేన వైపా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

‘మా ఇద్దరి ఆలోచనలు వేరు.. కానీ, లక్ష్యం ఒకటే.. నేను సాధించాలనుకుని, సాధించలేకపోయినది ఖచ్చితంగా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధిస్తాడు..’ అంటూ మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే, ఆ పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అయితే, ఆ పార్టీలోకి కొన్ని విష పురుగులు ఇతర పార్టీల్లోంచి దూరి.. తీవ్రమైన నష్టం కలిగించాయనుకోండి.. అది వేరే సంగతి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించినా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోవడానికి కారణం, వెన్నపోటుదారులే.

ఇక, 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని పోటీకి నిలిపారు. ఒకే ఒక్క ఎమ్మల్యే గెలిచారు జనసేన నుంచి.. జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. అయితే, జనసేన పార్టీ తరఫున చిరంజీవి ఎలాంటి ప్రచారమూ నిర్వహించలేదు. ఎందుకిలా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. కాగా, 2019 తర్వాత, పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షంగానే వైఎస్ జగన్ ప్రభుత్వానికి పలు అంశాలపై మద్దతిచ్చినట్లుగా ప్రకటనలు విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు కాదు, ప్రభుత్వ నిర్ణయాల పట్ల సానుకూల స్పందన అది.

మరోపక్క, చిరంజీవిని వైసీపీ ద్వారా రాజ్యసభకు పంపాలనే ఆలోచన వైసీపీలో ఎప్పటినుంచో జరుగుతోంది. తద్వారా పవన్ కళ్యాణ్‌కి షాకివ్వాలన్నది వైసీపీ వర్గాల భావన. సామాజిక వర్గ సమీకరణాలు వంటివన్నీ లెక్కలేసుకుని, చిరంజీవిని తమవైపుకు లాగాలని వైసీపీ చూస్తున్నా, చిరంజీవి మాత్రం అటు వైపుగా వెళ్ళడంలేదు.

మరోపక్క, చిరంజీవి కోసం బీజేపీ కూడా బంపర్ ఆఫర్ ఎప్పుడో సిద్ధం చేసింది. రాజ్యసభతోపాటు కేంద్ర మంత్రి పదవి కూడా చిరంజీవికి ఇవ్వాలనుకుంటోంది బీజేపీ. కానీ, చిరంజీవి వైపు నుంచి ‘సానుకూలత’ కనిపించడంలేదు బీజేపీకి. కాగా, ‘పవన్ కళ్యాణ్‌కి అన్నయ్యగా నా మద్దతు ఎప్పుడూ వుంటుంది.. నా తమ్ముడ్ని నేను ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నాను.. తమ్ముడిపై నాకు పూర్తి నమ్మకం వుంది.. అనుకున్నది సాధిస్తాడని..’ అని చిరంజీవి ఇప్పటికే చాలాసార్లు స్పష్టతనిచ్చారు.

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి వుంది.. ఇంకా మూడేళ్ళే సమయం వుండడంతో.. రాజకీయల్లో ఈక్వేషన్స్ ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా మారుతున్నాయి. దాంతో చింరజీవి ఈసారి కింగ్ మేకర్ అవుతారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి మాత్రం, తాను రాజకీయాలపై ఆసక్తితో లేనని అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...