‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమా తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుంటున్నా అని ముందే చెప్పారు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఆ హాలిడేస్ కాస్తా ఎక్స్టెండ్ అవుతున్నాయి. మరోవైపు ఆయన తదుపరి సినిమా ఇది అని ఇంకా ఖరారు కాకపోవడంతో అభిమానులు కాస్త టెన్షన్ లో ఉన్నారు.
అధికారికంగా న్యూస్ రాకపోయినప్పటికీ మహేష్ బాబు సినిమా పరశురామ్ తో ఉంటుందని తన సన్నిహితులు పక్కాగా చెబుతున్నారు. అలాగే కృష్ణ గారి బర్త్ డే కానుకగా మే 31న లాంచ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలిపారు కానీ ఇప్పుడు తనని కాదని ఇద్దరూ బాలీవుడ్ బ్యూటీస్ ని పరిశీలిస్తున్నారట. అందులో ఒకరు ఆల్రెడీ మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’లో కలిసి నటించిన కియారా అద్వానీ.. ఇటీవలే ఐ ఇంటర్వ్యూలో త్వరలోనే ఓ బిగ్ తెలుగు సినిమా చేయబోతున్నా అని చెప్పడం ఈ కాంబినేషన్ సెట్ అవ్వనుందని ఒక హింట్ దొరికింది.
మరోవైపు ప్రభాస్ ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన శ్రద్ధ కపూర్ ని కూడా పరిశీలిస్తున్నారట. ఒకసారి మహేష్ బాబు ఫైనల్ నేరేషన్ విన్న తర్వాత ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మహేష్ బాబు సరసన ఈ ఇద్దరిలో ఎవరైనా పెయిర్ బాగుంటుంది. ముందుగానే రొమాంటిక్ ఎంటర్టైనర్ కాబట్టి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోతుండనై చెప్పచ్చు. మరి ఈ చిత్ర టీం ఫైనల్ గా ఎవరిని ఓకే చేస్తారో చూడాలి.
మహేష్ తదుపరి సినిమా విషయంపై టెన్షన్ లో ఉన్న అభిమానులని సూపర్ హ్యాపీ చేసేలా చేసిన న్యూస్ మాత్రం, రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా మహేష్ బాబు తోనే అని చెప్పడం, అలాగే ఈ క్వారంటైన్ లో కొన్ని లైన్స్ ని కూడా ఫైనల్ చేస్తున్నామని చెప్పడమే.
760678 489098stays on subject and states valid points. Thank you. 655264
282431 104721Right after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method you will be able to take away me from that service? Thanks! 175232