Switch to English

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,803FansLike
57,764FollowersFollow

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే ఇదంతా.

వై నాట్ 175 అని నినదిస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన సీట్లు జస్ట్ 11 మాత్రమే.! సిద్ధం సభల పేరుతో, లక్షలాది మంది జనాన్ని పోగేసి, అప్పటి విపక్ష నేతల బొమ్మలపై వైసీపీ కార్యకర్తలతో ఆయా సభల్లో దాడులు చేయించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సాధించినట్లు.? ప్చ్..ఏమీ లేదు.

2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. కానీ, ఆ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. చూడ్డానికి వచ్చే జనమంతా ఓట్లెయ్యాలనే రూల్ ఏమీ లేదు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చేవారు.

అలా, జనసైనికులు.. జనసేన పార్టీకి నిఖార్సయిన రాజకీయ సైనికులుగా మారేందుకు సమయం పట్టింది. ఓట్లు వేయడమే కాదు, వేయించడం కూడా తెలుసుకున్నారు 2024 ఎన్నికలకొచ్చేసరికి జనసైనికులు. ఫలితం.. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు.. అదే సమయంలో, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ అభ్యర్థుల గెలుపులోనూ కీలక భూమిక పోషించారు.

జన సందోహం.. జన సునామీ.. జన సంద్రం.. వీటి గురించి, అందరికన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే బాగా తెలుసు. సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు.. ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి చేసి, చూసి వచ్చారు కదా మరి.!

‘జనాన్ని చూస్తున్నారు కదా.. జగనన్న ఓడిపోయారని ఎలా అంటార్రా.?’ అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇంకోపక్క, ‘వీళ్ళందరి ఓట్లూ ఏమైపోయాయ్..’ అని వైసీపీ నేతలు ఆశ్చర్యం నటిస్తున్నారు.

2024 ఎన్నికల్లో ఓటుకి ఐదు వేల రూపాయలకు పైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచినాగానీ, డజను సీట్లు కూడా గెలవలేకపోయింది వైసీపీ. ఇలాంటి కార్యక్రమాలకి జనాల్ని తరలించుకోవడం ఖర్చు దండగ అని తెలిసీ, జగన్ ఎందుకిలా చేస్తున్నారో.. వీటితో ఆయన ఏం సాధిస్తారో.. ఆయనకే తెలియాలి.!

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే మా బాధ తెలిసేది : జాన్వీకపూర్

జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం అమ్మడు మంచి...

నితిన్ కెరీర్ ను డైసైడ్ చేయబోతున్న ‘తమ్ముడు‘.. ప్లాప్ అయితే అంతే..

యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే వరుసగా ఆరు ప్లాపులు ఉన్నాయి. మధ్యలో ఓ సినిమా హిట్ అయినా.. దానికంటే ముందు మరో మూడు ప్లాపులు ఉన్నాయి. అంటే...

వైసీపీ నేతల అరాచకాలు.. ఉత్తరాంధ్ర వెనకబాటు..

ఏపీకి ఉత్తరాంధ్ర గుండెకాయ లాంటిది. అలాంటి ప్రాంతం వెనకబాటు వెనక వైసీపీ నేతల దారుణాలు ఉన్నాయంటున్నారు కూటమి నేతలు. అందుకే గల కారణాలను కూడా చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పారిశ్రామిక...

Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ కు భారీ ఖర్చు..! ఎంతో తెలుసా?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతున్న సినిమాపై అభిమానులు ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ సినిమాపై ఓ ఆసక్తికరమైన...

దిశా పటానీ అందాల బీభత్సం..

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను తన అందాలతోనే ఊపేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో ఆమె రేంజ్ లో అందాలను ఆరబోసేవారు లేరనే చెప్పుకోవాలి. కెరీర్ స్టార్టింగ్...