సినిమా, రాజకీయం.. ఈ రెండిటి మధ్యా విడదీయలేనంత గాఢమైన బంధం కనిపిస్తోంది ఇటీవలి కాలంలో. రాజకీయ ప్రముఖులు, సినీ తారలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో రాజకీయ నాయకుల హడావిడి ఎక్కువయ్యింది. ఆయా రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో సినీ తారల హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి, డ్రగ్స్ వివాదంలో హీరోయిన్లు మాత్రమే ఎందుకు ఇరుక్కుంటున్నట్లు.? హీరోల సంగతి తేలడంలేదెందుకు.? రాజకీయ నాయకుల ప్రస్తావన రావడంలేదెందుకు.? బాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయమై ఇప్పుడందర్నీ తొలిచేస్తున్న ప్రశ్నలివి.
ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అందాల భామల్లో కొందరికి ‘రాజకీయంగా’ పరోక్ష సంబంధాలు బాగానే వున్నాయి. అయితే, ఆ లింకులేవీ ప్రస్తుతం ‘ఎన్సిబి’ విచారణ సందర్భంగా తెరపైకొ రావడంలేదు. ఆ మాటకొస్తే, సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనుమానాస్పద మరణం వెనుక కూడా ఓ రాజకీయ ప్రముఖుడి పుత్రరత్నం పాత్ర వుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, అస్సలేమాత్రం రాజకీయ లింకులు లేకుండా, ఆ మాటకొస్తే.. హీరోల లింకులూ లేకుండా ‘డ్రగ్స్ కేసు’ విచారణ జరుగుతోంది. కర్నాటకలో డ్రగ్స్ కేసే కొంత నయ్యం.. అక్కడ హీరోయిన్లతోపాటు, కొందరు హీరోల పేర్లూ తెరపైకొస్తున్నాయి.
బాలీవుడ్ డ్రగ్స్ కేసు మాత్రం ఓ పద్ధతి ప్రకారమే ‘విచారణ’ జరుగుతోందనీ, ఆ పద్ధతిని తెరవెనుకాల పెద్దలు డిజైన్ చేస్తున్నారనే విమర్శలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ‘విచారణ సందర్భంగా దీపికా పడుకొనే ఏడ్చింది..’ అనే మాట బయటకొచ్చింది. ‘మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..’ అనే మాట కూడా అధికారులు ప్రకటించకుండానే ప్రచారంలోకి వచ్చింది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి.? అంటే, ఎవరో రాసిన స్క్రీన్ ప్లే ప్రకారమే విచారణ జరుగుతోందనే కదా అర్థం.! అందుకేనేమో.. ఈ కేసులో ఇప్పటిదాకా హీరోల పేర్లు లేవు, రాజకీయ నాయకుల పేర్లు అసలే లేవు.
332347 913642Respect to website author , some good selective information . 312383
712165 256790I appreciate your work , thanks for all the informative weblog posts. 605249