ఈ కాలంలో కూడా చాలా మంది అమ్మాయి పుట్టిందని బాధ పడే వారు ఉన్నారు… గర్భంలోనే చిదిమేసే వారు కూడా ఉన్నారు. వారందరికి కూడా చెంప పెట్టు అన్నట్లుగా మహారాష్ట్రకు చెందిన గిరీష్ పాటిల్ అనే వ్యక్తి తనకు కూతురు పుట్టిందని సంతోషంగా ఆ కూతురును ఏనుగుపై ఊరేగింపుగా తన ఇంటికి తీసుకు వెళ్లాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్గావ్ లో నివశించే గిరీష్ పాటిల్ ఇంట్లో గత 35 సంవత్సరాలుగా ఆడ పిల్ల సంతానం లేదు. ఎన్నో పూజలు చేసిన తర్వాత జన్మించిన ఆడపిల్లకు ఏనుగు అంబారీతో స్వాగతం పలకాలని గిరీష్ పాటిల్ నిర్ణయించుకున్నాడు.
అయిదు నెలల క్రితం జన్మించిన తన కూతురును ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఏనుగు అంబారీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె జీవితంలో మర్చిపోలేని విధంగానే కాకుండా ఆడపిల్ల అంటే చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికి కూడా షాక్ అన్నట్లుగా గిరీష్ పాటిల్ ఈ ఉత్సవంను నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది గ్రేట్ విషయం కదా…!