Switch to English

చైనాతో యుద్ధమా.? రాజకీయాలొద్దు ప్లీజ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనా – భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాలోనే పుట్టిన కరోనా వైరస్‌ పట్ల అగ్రరాజ్యం అమెరికా గుర్రుమంటోన్న విషయం విదితమే. అసలు ఆ వైరస్‌ పుట్టు పూర్వోత్తరాలేంటన్నదానిపై విచారణ జరగాల్సిందేనని ప్రపంచ దేశాలతోపాటు భారతదేశం కూడా నినదించడం చైనాకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కారణంగానే, సరిహద్దుల్లో కవ్వింపులు షురూ చేసింది. పొరుగునున్న నేపాల్‌ని కూడా భారతదేశం మీదకి ఎగదోస్తోంది చైనా. పాకిస్తాన్‌ – చైనాల మధ్య స్నేహం గురించి తెలియనిదెవరికి.? వెరసి, భారతదేశానికి సరిహద్దుల్లో శతృవులు పెరిగిపోతున్నారన్నమాట.

భారత భూభాగానికి సమీపంలో చైనా, భారీ స్థాయిలో సైన్యాన్నీ, ఆయుధాల్ని మోహరిస్తోంది. ‘ఏ క్షణాన అయినా చైనా, భారతదేశం మీద యుద్ధం ప్రకటించవచ్చు..’ అనేలా వుంది పరిస్థితి. మరోపక్క, సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. కీలక విభాగాలతో. రక్షణ సలహాదారు అజిత్‌ దోభాల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినంత తేలిక కాదు, చైనాతో వ్యవహారం. ఆయుధ సంపత్తి పరంగా చూసుకుంటే, చైనా కంటే భారత్‌ వెనుకబడి వుందన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, యుద్ధమంటూ జరిగితే చైనాకి ధీటుగా బదులివ్వగల సత్తా భారతదేశానికి వుంది. అయినాగానీ, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఇరు దేశాలకీ మంచిది కాదు. మరీ ముఖ్యంగా భారతదేశానికి అసలే మంచిది కాదు.

కానీ, సరిహద్దుల్లో చైనా కవ్వింపులు ముదిరి పాకాన పడుతున్నాయి. చాలా ఏళ్ళ క్రితమే భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్న చైనా, ఇప్పుడు కొత్త వివాదాల్ని తెరపైకి తెస్తోంది. పాక్‌ ఆక్రమిత కాశ్మిర్‌ అని ఎలా అంటున్నామో, చైనా ఆక్రమిత కాశ్మీర్‌ కూడా వుంది.. అదే అక్సాయ్‌ చిన్‌. దానికి సమీపంలో, భారతదేశంలో వున్న ప్రాంతాలూ తమవేనని చైనా అంటోంది. చైనాతో దౌత్యపరంగా చేయడానికేమీ వుండదు. ఎందుకంటే, చైనా బుద్ధి ఎప్పటికీ మారదు.

ఇదిలా వుంటే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత రాజకీయం చేసిందో చూశాం. గత ఎన్నికల్లో ఆ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశాన్ని అత్యద్భుతంగా వాడేసుకున్నారు కమలనాథులు. ఇప్పుడూ అదే స్థాయి రాజకీయానికి తెరలేపారన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

‘దౌత్యం’లో మోడీ సర్కార్‌ విఫలమయ్యిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కాంగ్రెస్‌ కావొచ్చు, మరో రాజకీయ పార్టీ కావొచ్చు.. ఈ సందర్భంలో రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏదిఏమైనా, భారతదేశం ఏదన్నా సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడే ఇలాంటి సరిహద్దు సమస్యలు ఎందుకు వస్తుంటాయో ఏమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...