Switch to English

సిగ్గు సిగ్గు: ‘కోటి’ కోసం చచ్చిపోదామనుకుంటున్నారట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పది రూపాయల కోసం ప్రాణాలు తీసే మానవ మృగాల గురించి వింటున్నాం. కానీ, కోటి రూపాయల కోసం చచ్చిపోవాలనుకుంటున్న వారిని చూడగలమా.? ఏమో, ఎక్కడన్నా వున్నారేమో.! వారి కష్టం ఎలాంటిదో ఏమో.! కానీ, అలాంటోళ్ళు వుంటారని ఎవరూ అనుకోం. అయితే, అధికార వైఎస్సార్సీపీ మాత్రం, ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన కోటి ఎక్స్‌గ్రేషియా చూసి.. అయ్యో, మేం చచ్చిపోయినా బావుండేది.. మా కుటుంబాలకు కోటి రూపాయలు వచ్చేది..’ అనుకుంటున్నారని చెబుతోంది.

అధికార పార్టీకి చెందిన ఓ నేత, పైగా ప్రజా ప్రతినిది¸.. అధికార పార్టీకే చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో చేసిన జుగుప్సాకరమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల సారాంశమిది. ‘20 లక్షలు ఎక్కువ వాళ్ళకి.. అలాంటిది మా ముఖ్యమంత్రి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు’ అని ఓ మంత్రి, మనిషి ప్రాణానికి విలువ కట్టి హీనంగా మాట్లాడితే, కింది స్థాయి నేతలు ఇంకెంతగా చెలరేగిపోతారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై అధికార పార్టీ నేతల అవాకులు చెవాకులు శృతిమించిపోతున్నాయి. నిజానికి, జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. అదే సమయంలో, అది పూర్తి నిర్లక్ష్యంగానే చోటు చేసుకున్న మానవ తప్పిదం. అందుకే, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థను ఆదేశించింది.

మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? అది గొప్ప సంస్థ.. ఫ్యాక్టరీ నిర్వహణలో వాళ్ళకి మంచి పేరుంది.. అంటూ ముఖ్యమంత్రి కితాబులివ్వడంలోనే తెరవెనుక ‘లాలూచీ’ సుస్పష్టంగా తెలిసిపోతోంది. మనిషి ప్రాణానికి వెలకట్టే స్థాయి ఎవరికైనా వుందా.? ఛాన్సే లేదు.

పైగా, ‘మీరిచ్చే కోటి రూపాయలు మాకొద్దు.. మా బిడ్డ ప్రాణం ముందు ఈ కోటి రూపాయలు ఎక్కువేం కాదు.. మాకు న్యాయం కావాలి..’ అని బిడ్డను కోల్పోయిన తల్లి, ‘రెండు కోట్లిస్తాం.. మా కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తారా.?’ అని తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితులు ప్రశ్నిస్తున్న వేళ, కోటి కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా వున్నారని ఓ ప్రజా ప్రతినిది¸ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేయడమంటే.. వీళ్ళని రాజకీయ నాయకులు అనగలమా.? అసలు మనుషులని అనగలమా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...