విశాఖ తీర ప్రాంతంలో నిన్న చెలరేగిన రింగు వలల వివాదం మత్స్యకారుల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సముద్రంలోనే పడవల్లో వలలను తగులబెట్టడం, పడవల దహనంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఏకంగా నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన దళాలు రంగంలోకి దిగారు. ప్రభావిత గ్రామల్లో 144 సెక్షన్ విధించారు. మత్స్యకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.
తెప్పలు, ఇంజిన్ బోట్లు, మరపడవలపై చేపల వేట సాగిస్తారు. అయితే.. మరపడవలు సముద్రంలో 15 కిలోమీటర్ల తర్వాత, ఈ పరిధిలోపు తెప్పలు, ఇంజిన్ బోట్లు వేట సాగిస్తాయి. అయితే.. రింగు వలల వివాదం ఎప్పటి నుంచో ఉంది. హైకోర్టు వరకూ వెళ్లింది.
గత మే నెలలో హైకోర్టు తీర్పు ఇస్తూ.. 8కిలోమీటర్ల ఆవల రింగు వలలతో ఇంజిన్ బోట్లు వేట సాగించాలని చెప్పింది. అయితే.. కొందరు హైకోర్టు తీర్పును కాదని కేవలం 3కిలోమీటర్ల లోపునే రింగు వలలను ఉపయోగించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ప్రభుత్వం కూడా సమస్య పరిష్కరించలేక పోయింది.
842646 718488Some truly good and utilitarian info on this internet website , besides I feel the layout holds amazing features. 613346