వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక మందన్న జంట తమ వివాహం సందర్భంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
విరోష్ విడుదల చేసిన ప్రకటనలో, “మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరు చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సంతోషాన్ని మీతో కలిసి పంచుకునేందుకు దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి” అని పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమం ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో నిర్వహించబడనుంది. వివిధ దేవాలయాల్లో భక్తులకు అన్నదానం చేయడంతో పాటు స్వీట్స్ పంపిణీ చేయనున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్న వేళ, విరోష్ చేపట్టిన ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. వివాహ వేడుక తర్వాత ప్రజలతో ఆనందాన్ని పంచుకోవాలనే ఈ నిర్ణయం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.




