‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి హీరోగా 1990 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా ‘విరాట పర్వం’. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 10 రోజుల ఫైనల్ షెడ్యూల్ కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడింది. నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉండడం వలన ఈ చిత్రంలోని ఎక్కువ భాగం రియలిస్టివ్ విజువల్స్ కోసం వరంగల్, కేరళ, వికారాబాద్ అడవుల్లో షూట్ చేశారు.
ఇలా అడవుల్లో షూటింగ్ జరిగే సందర్భాల్లో కొన్ని డేంజరస్ సంఘటనలు జరుగుతుంటాయి. ఈ సినిమా సెట్ లోనూ అలాంటి సంఘటనే జరిగిందని ఈ చిత్ర టీం తెలిపింది. కేరళలో షూటింగ్ చేస్తున్న టైములో ఓ రోజు ప్యాకప్ చేసుకొని బయలుదేరే టైం లో ఓ ఏనుగుల గుంపు వారి మీదకి దూసుకొస్తున్నాయన్న విషయం తెలియగానే వాహనాలు, షూటింగ్ ఎక్విప్ మెంట్ అన్నీ వదిలేసి ఒక అరగంట వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారట. ఈ ఘటనలో సాయి పల్లవి, డైరెక్టర్ వేణు ఉడుగుల అండ్ టీం ఉండగా, రానా కొద్ది సేపటి క్రితమే అక్కడి నుంచి వెళ్లడంతో సేవ్ అయ్యాడట. అలాంటి సంఘటనలు అక్కడ కామన్ గా జరుగుతుంటాయని తెలియడంతో ఆపై అప్రమత్తంగా ఉన్నారని సమాచారం.
సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర నక్సలైట్ పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి – సురేష్ బాబు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
697992 528548superb post. Neer knew this, appreciate it for letting me know. 58134