Switch to English

వినేష్ ఫోగట్…Wrestler Also… Fighter Also

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,852FansLike
57,764FollowersFollow

వినేష్ ఫోగట్.. ఇండియన్ ప్రొఫెషనల్ రెజ్లర్.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అందరి అంచనాలను నిజం చేస్తూ సునాయాసంగా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఈరోజు కొన్ని గంటల్లో రెజ్లింగ్ లో 50 కేజీల విభాగంలో తుది పోరు జరుగుతుందనగా.. ఒక్కసారిగా ఆమెకు ఒలింపిక్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెపై అనర్హత వేటు వేశారు. నిర్ణీత బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా ఒక్కసారిగా ఆమెతో పాటు యావత్ భారతీయుల ” బంగారు” కలపై నీళ్లు చల్లినట్టైంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చకు దారితీసింది. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తీసుకున్న నిర్ణయం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది!

వినేష్ మంగళవారం బౌట్ సమయంలో బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. పోటీలో పాల్గొనే ఆటగాళ్లు రెండు రోజులపాటు నిర్ణీత బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. కానీ, ఫైనల్స్ కి ముందు వినేష్ ఒకసారిగా రెండు కేజీల బరువు పెరిగింది. ఆ బరువును తగ్గించుకోవడానికి ఆమె రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఎక్సర్సైజ్ లు చేసింది. అయినప్పటికీ 100 గ్రాముల బరువును అదుపులో ఉంచుకోలేకపోయింది. బరువు తగ్గేందుకు ఆమె శరీరం నుంచి రక్తం తీయడంతో పాటు జుట్టు కూడా కత్తిరించినట్లు సమాచారం. సాధారణంగా మ్యాచ్ కి ముందు బరువు సరిచూసుకోవడానికి అరగంట సమయం ఇస్తారు. వినేష్ కి ఆ సమయం కూడా దాటిపోవడంతో.. మరికొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తోసిపుచ్చారు. అనంతరం ఆమెపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఒలింపిక్స్ లో ఫ్రీ స్టైల్ విభాగంలో మహిళలకు ఆరు విభాగాలు ఉంటాయి. 50, 53, 57, 62,68, 76 విభాగాల్లో పోటీ పడుతుంటారు. వినేష్ 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. క్రీడాకారులు ఆయా కేటగిరిలో పోటీ పడుతున్నారని రుజువు చేసుకునేందుకు ప్రతిరోజు ఉదయం బరువు చెక్ చేస్తారు. అలా చెక్ చేసే సమయంలో వారికి అరగంట పాటు సమయం ఇస్తారు. జెర్సీ తో పాటు బరువు తీస్తారు. మెడికల్ టెస్టులు చేస్తారు. గోర్లు కత్తిరించుకున్నారో లేదో చూస్తారు. క్రీడాకారులు ఆ బరువును రెండు రోజులపాటు మైంటైన్ చేయాల్సి ఉంటుంది. రెండో రోజు మాత్రం వెయిట్ చెక్ చేసుకోవడానికి 15 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు. అలా ఈరోజు వినీష్ కి కూడా అదే సమయం ఇవ్వగా.. ఆ టైం కి ఆమె తన నిర్ణీత బరువును కంట్రోల్ చేసుకోలేకపోయారు.

వినేష్ కు ప్రముఖుల మద్దతు

ఒలింపిక్స్ ఫైనల్స్ ముంగిట అనర్హత వేటు పడిన వినేష్ కి ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా నిలిచారు. ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై మరోసారి ఒలింపిక్స్ కమిటీతో మాట్లాడాలని ఇండియన్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు పీటీ ఉష తో మోడీ ఫోన్లో మాట్లాడారు. వినేష్ కు న్యాయం చేసేందుకు భారత్ కి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. మరోవైపు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం అనేది సమస్య కాదని తోటి రెజ్లర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్ర సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. బరువు విషయంలో ఒలింపిక్స్ సంఘం మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లైంగిక వేధింపులపై పోరాటం నుంచి ఒలింపిక్స్ వరకు

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు వినేష్ పెద్ద యుద్ధమే చేసింది. లైంగిక వేధింపులపై ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ రోడ్లపై భారత రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వినేష్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. ప్రభుత్వం తనకు అందించిన ” ఖేల్ రత్న” పురస్కారాన్ని ఢిల్లీ రోడ్లపై వదిలేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాసింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో తమకు న్యాయం జరగనప్పుడు అలాంటి పురస్కారాలకు అర్థం లేదని ఆ లేఖలో వినేష్ పేర్కొంది. ఆమెకు మద్దతుగా ఇతర రెజ్లర్లు కూడా తమ పురస్కారాలను, పతకాలను తిరిగిచ్చేశారు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

కోటలు.! కోటరీలు.! వైఎస్ జగన్‌పై విజయసాయి రెడ్డి సెటైర్ల వెనుక.!

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని,...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఎక్కువ చదివినవి

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్ మీట్లో దిల్ రాజు

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈమేరకు వివరాలు...

వైఎస్సార్సీపీ యువత పోరు.! భలే కామెడీ అయిపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిజానికి, గతంలోనే జరగాల్సిన కార్యక్రమం ఇది. విపక్షం అన్నాక, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

పిల్లలపై రాజకీయాలు వద్దు..!

పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలని అన్నారు నారా లోకేష్. అందుకు తగినట్టుగా విద్యాశాఖలో మార్పులను తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల విద్య మీద రాజకీయ ప్రభావం లేకుండా చేస్తున్నారు. రాజకీయాలకు అసలు...

వైకాపా ఫీజు పోరుపై లోకేష్ ధ్వజం

శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై వైకాపా వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. మండలి ఛైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు....