రైలులో కొందరు టికెట్లు కొనుగోలు చేయకుండానే ప్రయాణించడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. రద్దీగా ఉన్న రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. టికెట్ లేని ప్రయాణికుల ద్వారా ప్రతి ఏడాది వచ్చే జరిమానాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి.
ప్రయాణాలు చేసే సమయంలో టికెట్లు కొనుగోలు చేయని వారిని చూశాం కానీ టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేయని వారిని అరుదుగా చూస్తూ ఉంటాం. టికెట్ తీసుకున్న తర్వాత ఏదైనా పని పడి లేదంటే బండి మిస్ అయ్యి ప్రయాణం చేయక పోవడం చూశాం కానీ ప్రయాణం చేయమని తెలిసి కూడా టికెట్లు కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని దయాల్ పూర్ రైల్వే స్టేషన్ ను 1954 లో ప్రారంభించారు. 2006 సంవత్సరంలో ప్రయాణికులు ఉండటం లేదని ఈ స్టేషన్ ను మూసేశారు. అప్పటి నుండి దయాల్ పూర్ ప్రజలు ఆందోళనలు చేసి.. విజ్ఞప్తులు చేసి 2022 జనవరిలో స్టేషన్ ను తిరిగి ఓపెన్ చేయించారు. నెల నెల సుమారుగా 700 టికెట్ల వరకు అమ్ముడు పోతూ ఉండాలి.
తిరిగి ప్రారంభించిన సమయంలో టికెట్లు బాగానే అమ్ముడు పోయాయి కానీ ఈ మధ్య టికెట్లు అమ్ముడు పోక పోవడంతో గ్రామస్తులు స్వయంగా కొన్ని టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా నెలలో టికెట్ల అమ్మకాలు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే గ్రామస్తులు ప్రయాణం చేయకున్నా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అలా తమ రైల్వే గ్రామంలోని రైల్వే స్టేషన్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఊరు ప్రజల పట్టుదలను అభినందించాల్సిందే.
947259 785354whoa, this really is a actually very good piece of information. I read about something like this before, this really is impressively great stuff. 636745
684 187440Sewing Machines […]any time to read or go towards the content or perhaps internet sites we undoubtedly have associated with[…] 948431