స్టార్ రైటర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, బజరంగి భాయ్ జాన్, మెర్సల్ లాంటి సంచలన సినిమాలతో అయన క్రేజ్ బాలీవుడ్ దాకా పాకింది. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నెక్స్ట్ సినిమా కోసం ఓ ప్రముఖ కమెడియన్ ని ఎంచుకున్నాడు. కమెడియన్ తో విజయేంద్ర ప్రసాద్ సినిమా అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.
ఆ వివరాళ్లోకి వెళితే .. కమెడియన్ గా సప్తగిరి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో అటు హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు. సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాలో నటించిన సప్తగిరి తాజాగా హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కథ అందించింది ఎవరో కాదు విజయేంద్ర ప్రసాద్.
వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్న కంచి కామాక్షి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. స్టార్ రైటర్ కథతో సినిమా చేస్తున్న సప్తగిరికి ఈ సారి సంచలన విజయం ఖాయం అని అంటున్నాయి సినీ వర్గాలు.
Also Read: ఆర్ఆర్ఆర్ – ఎన్టీఆర్ ‘లెగ్’ పీస్ అదిరింది.!
