విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు మంచి రేంజ్ కు చేరుకున్నాడు. రీసెంట్ గా విజయ్ సినిమాలు ప్లాప్ అయినా కూడా తన క్రేజ్ కు లోటేమి లేదు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పూరి జగన్నాథ్ దీనికి దర్శకుడు.
ఈ సినిమా ఇంకా షూటింగ్ చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తెలివిగా ఇన్వెస్ట్మెంట్ ను పెడుతున్నాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ మల్టిప్లెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఏషియన్ – విజయ్ దేవరకొండ కలిసి ఏవిడి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ చైన్ ను మొదలుపెట్టారు.
మహబూబ్ నగర్ లో ఈ మల్టిప్లెక్స్ చైన్ నిర్మాణం పూర్తయింది. దసరా నుండి ఈ మల్టిప్లెక్స్ అందుబాటులోకి వస్తుంది.
669715 414222I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 143785