విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా సంపాదించి అమాయక ప్రజలను బలి చేస్తున్నారని పోలీసులు అలాంటి వారి మీద ఉక్కు పాదం మోపుతున్నారు.

ఐతే తాజాగా ఈ కేసులో విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీస్ లో విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని.. అతనిపై కూడా పోలీసులు యాక్షన్ కి రెడీ అవుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది.

విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేశాడని.. ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉన్నారని చెప్పారు.

అంతేకాదు విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అన్నది ఆయన టీమ్ పరిశీలిస్తుందని వెల్లడించారు. ఆ కంపెనీ, ఆ ప్రొడక్ట్ చట్ట ప్రకారం అనుమతి ఉందని తెలిస్తేనే విజయ్ ఆ యాడ్ కు ప్రచార కర్తగా ఉంటారని అన్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా తెలియచేసిందని విజయ్ టీమ్ చెప్పింది.

ఏ 23 అనే సంస్థతో విజయ్ దేవరకొండ అగ్రిమెంట్ గతేడాదితో ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

దేవాన్ష్‌తో కలిసి ‘మిషన్ ఆగమన్’ వీక్షించిన లోకేష్

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన ‘మిషన్ ఆగమన్’ విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్...

పేదలకు శాశ్వత భూ పట్టాలు పంపిణీ చేసిన నారా లోకేష్

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. "మన ఇల్లు – మన లోకేష్" కార్యక్రమంలో భాగంగా మంగళగిరి,...

రామ్‌చరణ్–సుకుమార్ మూవీకి కౌంట్‌డౌన్.. పూజ ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలపబోతున్న విషయం తెలిసిందే. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న...

రిజిస్ట్రేషన్ సేవలపై తప్పుడు ప్రచారం.. వాస్తవాలు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం ఖండించింది. ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా సేవలు అందించడమే ఈ సంస్కరణల లక్ష్యమని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను...

Balakrishna: షూటింగ్ లో బాలకృష్ణకు గాయం.. ఆసుపత్రికి తరలింపు

Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. #NBK111 వర్కింగ్ టైటిల్ తో...