హీరో విజయ్ దేవరకొండ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ప్రమోట్ చేసింది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు.
ఈ రోజు ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ వివరాలు, ట్రాన్సాక్షన్ వివరాలన్నీ అందజేశానని చెప్పారు. ఈ వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
“రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్కి, బెట్టింగ్ యాప్స్కి తేడా ఉంటుంది. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, ఒలింపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. నేను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్కే. ఇది పూర్తిగా లీగల్ గేమింగ్ యాప్. దేశంలో ఏది సరైనది, ఏది కాదో నిర్ణయించడానికి కోర్టులు, ప్రభుత్వాలు ఉన్నాయి” అని విజయ్ దేవరకొండ అన్నారు.
