సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాలల మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న, ఆయన తల్లి మాధవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా విద్యాధికారి రమేష్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ, మార్కుల కంటే వాటిని సాధించేందుకు విద్యార్థులు చూపిన క్రమశిక్షణ, ఏకాగ్రత, కృషి మరింత విలువైనవని అన్నారు. తాను, రష్మిక కూడా విద్యార్థి దశలో ర్యాంకర్లు కాదని, కానీ కష్టపడి ముందుకు రావచ్చని చెప్పారు. అచ్చంపేటలో ప్రారంభమైన ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో నాగర్‌కర్నూల్ జిల్లా మొత్తానికి, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని తమ లక్ష్యమని వెల్లడించారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ, పేద కానీ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎంత ఎదిగినా సొంత ఊరిని మరచిపోకుండా విద్యార్థుల కోసం ముందుకు రావడం విజయ్ దేవరకొండ గొప్పతనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల వంటి విలువలు జీవితంలో విజయానికి పునాది అని అన్నారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. విద్య ద్వారా జీవితాలను మార్చే లక్ష్యంతో ది దేవరకొండ ఫౌండేషన్ చేపట్టిన ఈ ప్రయత్నం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

ఎక్కువ చదివినవి

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ఏపీ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల జోరు.. లోకేష్ సంస్కరణలతో పెరుగుతున్న నమ్మకం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు సంస్కరణలు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

Jana Nayagan: ‘జననాయగన్ కు తప్పని ఇబ్బందులు..’ ఆన్ లైన్లో ఎంతమంది చూశారో తెలుసా..?

Jana Nayagan: తమిళ అగ్ర హీరో, సీఎం విజయ్ నటించిన సినిమా ‘జననాయగన్’. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే నటించిన చివరి సినిమాగా జననాయగన్ ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయినా...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...