Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈసందర్భంగా ఓ ప్రకటన చేశారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ చూపిన విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆర్ధికసాయం చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ హామీని నెరవేర్చారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మొత్తం 180 మంది విద్యార్ధులు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా లబ్ది పొందనున్నారు. వీరిలో 45 మంది ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఉన్నారు. ఈమేరకు వీరి జాబితాను విడుదల చేశారు. 9,10 తరగతుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినవారికి ఈ స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్ధులకు ఈ స్కాలర్ షిప్స్ వారికి అండగా నిలవనున్నాయి.
ముఖ్యంగా స్వగ్రామమైన తమ్మన్ పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుంచి 9వ తరగతిలో బి.హేమలత (మొదటి ర్యాంక్), పి.ప్రణీత (రెండో ర్యాంక్)తోపాటు 10వ తరగతిలో కె.గణేశ్ (మొదటి ర్యాంక్), బి.అనిల్ (రెండో ర్యాంక్) సాధించిన స్కాలర్ షిప్ పొందారు. చదువుపై శ్రద్ధ చూపించే విద్యార్ధుల్లో పోటీతత్వం నింపి వారి విద్యాభివృద్ధికి విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం.. దానిని అమలు చేయడంపై గ్రామస్థులు, ఆయన అభిమానులు హర్షిస్తున్నారు.
We are on our way to Thummanpet.
The little village where my Father was born.In February – @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a… pic.twitter.com/wLNSr4ZZHe
— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026
