రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చాలా టెన్షన్ లో ఉన్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకుని తీసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపులుగా మారడంతో .. విజయ్ క్రేజ్ కి పెద్ద డామేజ్ ఏర్పడేలా ఉంది పరిస్థితి. విజయ్ దేవరకొండ కు ఇప్పటికే ఎవ్వరు ఊహించని క్రేజ్ రావడం, ఒక్కసారిగా సూపర్ స్టార్ గా ఇమేజ్ అందుకోవడంతో విజయ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ క్రేజ్ ని నిలబెట్టేందుకు చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పరాజయాలు అవ్వడంతో విజయ్ ఇమేజ్ కి డామేజ్ ఏర్పడింది.
వరుసగా నోటా, డియర్ కామ్రేడ్, లేటెస్ట్ గా వరల్డ్ ఫేమస్ లవర్. ఇలా వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న హీరో విజయ్ దేవరకొండ కి మరో పెద్ద షాక్ ఇచ్చింది మైత్రి మూవీస్ బ్యానర్. డియర్ కామ్రేడ్ సినిమా సమయంలోనే విజయ్ తో మరో సినిమాకు కమిట్మెంట్ తీసుకున్న ఈ బ్యానర్ తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో టైటిల్ తో ఓ సినిమా మొదలెట్టారు.
డియర్ కామ్రేడ్ సినిమా షూట్ అయిపోయాక హీరో సినిమా షూటింగ్ మొదలెట్టి అప్పటికే ఓ షెడ్యూల్ ను కూడా తీసి .. ఎందుకో ఆపేసారు. అప్పటినుండి ఆగిపోయిన ఈ సినిమాను ఇకపై తీయలేమని ,ఆ సినిమాను ఆపేస్తున్నట్టు మైత్రి మూవీస్ నిర్ణయం తీసుకున్నదట? ఎందుకంటే ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండకు వరుస సినిమాలు ప్లాప్ లుగా మిగలడం, దాంతో అయన క్రేజ్, అటు మార్కెట్ అన్ని వీక్ అవ్వడంతో హీరో సినిమా ఆపేయడమే బెటర్ అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.
దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఆపేస్తే .. ఇప్పటివరకు జరిగిన షూటింగ్, అడ్వాన్ గా ఇచ్చిన రెమ్యూనరేషన్స్ కలిపి పదికోట్ల వరకే లాస్ .. మరి సినిమా తీసాకా ఏదైనా తేడా కొట్టిందంటే .. మొదటికే మోసం వస్తుందని భావించారో ఏమో. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.
742594 216382Outstanding post, I think folks really should learn a lot from this web website its rattling user genial . 870397
598324 314091Thanks for this great post! It has long been really beneficial. I wish that youll carry on posting your wisdom with us. 13910