ప్రియాంక రెడ్డి హత్య తరువాత దేశంలో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నేరస్తులు ఎవరూ అనే విషయం ఇప్పటికే తెలిసిపోయింది. పోలీసులు అరెస్టులు కూడా చేశారు. కానీ, వాళ్ళను అలా పట్టుకొని జైలుకు తరలిస్తే సరిపోతుందా? కోర్టుకు తరలించి వాళ్ళు చేసిన నేరం రుజువయ్యి వారికీ శిక్ష పడాలి అంటే ఎంత సమయం పడుతుంది.. అప్పటి వరకు వాళ్ళు బ్రతికున్నారు అనే విషయం బాధితురాలి తల్లిదండ్రులను ఎంతగా బాధిస్తుందో చెప్పక్కర్లేదు.
ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే నేరస్తులను వెంటనే శిక్షించాలి.. దొరికిన వెంటనే చంపెయ్యాలి. గల్ఫ్ దేశాల్లో చేసినట్టుగానే మన దేశంలో కూడా అలాంటి శిక్షలు విధించాలని బహిరంగంగా ఉరి తీయాలని లేదంటే బహిరంగంగా కాల్చి చంపాలని అంటున్నారు. రేప్ చేసిన వాళ్లకు ఇలాంటి శిక్షలు విధించేలా చట్టాలు తీసుకురావాలని అంటున్నారు. ఇదిలా ఉంటె, ప్రియాంక రెడ్డి రేప్ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళు తప్పు చేశారని తేలితే.. వారిని చంపేయాలని అంటున్నారు. ఈ నలుగురు నిందితుల్లో చెన్నకేశవులు పెళ్లయింది.
ప్రేమ వివాహం. భార్యపేరు లక్ష్మి. ప్రస్తుతం ఆమె గర్భవతి.. తన భర్త తప్పు చేశాడని తెలిస్తే.. వెంటనే చంపేయండి అని అంటోంది. తప్పు చేసిన మరకలు పుట్టబోయే తన బిడ్డకు అంటకూడదని.. తన భర్త పేరు తెలియకుండా బిడ్డను పెంచుతానని అంటోంది. మిగతా నిందితుల తల్లిదండ్రులు కూడా అలానే అంటున్నారు. నిందితుల తల్లిదండ్రులు సైతం ప్రియాంక రెడ్డి వైపే మాట్లాడుతున్నారు. నిందితుల బంతి పోలీసుల చేతుల్లో ఉన్నది. వాళ్ళను ఏం చేస్తారో చూద్దాం.
161150 18155I conceive this web site holds some real superb information for everyone : D. 354428
709951 243790This internet internet site is my inspiration , really excellent layout and perfect topic matter. 183766