ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారం రోజుల పాటు ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తన బులిటెన్లో తెలిపింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2258, అనంతపురం 1534, గుంటూరులో 1458, ప్రకాశంలో 1399, కర్నూలులో 1238, చిత్తూరులో 1198, తూర్పు గోదావరిలో 1012, నెల్లూరులో 1103 ఉన్నాయి. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 304 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ తో విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున నలుగురు మృతి చెందారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14542 గా ఉంది. కరోనా నుంచి నిన్న 3,969 మంది కోలుకున్నారు.