Switch to English

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై వెంకట్, బాబా నిర్మాతలుగా, అజయ్.యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, బిగ్‌బాస్ ఫేమ్ బెజవాడ బేబక్క, దర్శకనిర్మాత సాయివెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. నటుడు సతీష్ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపిస్తున్నానని, ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెస్తుందని అన్నారు. దర్శకుడు అజయ్ సినిమాపై పూర్తి అంకితభావంతో పనిచేశారని, నిర్మాతలు వెంకట్, బాబా ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించారని చెప్పారు. బేబక్క మాట్లాడుతూ హీరో విక్రమ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుందని, ఆనంద్ రాజా అందించిన పాటలు చాలా బాగున్నాయని, హీరోయిన్ రమ్య తెరపై ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ రాజా మాట్లాడుతూ, ఈ చిత్రంతో తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతంతో పాటు లిరిక్స్ కూడా తానే అందించినట్లు చెప్పారు. ‘వన్ టు త్రీ’ అనే పాట ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చుతుందని తెలిపారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ, హీరోగా తనను తాను స్క్రీన్‌పై చూసుకుంటే భావోద్వేగానికి లోనయ్యానని, అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. మంచి పేరు తెచ్చుకుని తన తండ్రిని గర్వపడేలా చేస్తానని అన్నారు.

హీరోయిన్ రమ్య మాట్లాడుతూ, ‘వెంకీ పింకీ జంప్’ తన తొలి చిత్రం అని, ఇందులో పింకీ పాత్రలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. అతిథిగా హాజరైన నిర్మాత లయన్ సాయివెంకట్ సినిమా పాటలను ప్రశంసిస్తూ, విడుదల సమయంలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

దర్శకుడు అజయ్.యన్ మాట్లాడుతూ, ‘వెంకీ పింకీ జంప్’ ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అని, టైటిల్‌నే కథకు సంకేతమని అన్నారు. ప్రేమలో ఉన్న వెంకీ, పింకీ తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఊరి నుంచి పారిపోతారని, ఆ తర్వాత వారి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నదే కథ అని వివరించారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. ‘వెంకీ పింకీ జంప్’లో హీరో విక్రమ్, హీరోయిన్ రమ్య మంచి నటన కనబరిచారని, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

యూత్, ప్రేమ, వినోదం, కమర్షియల్ అంశాలతో రూపొందిన ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో రిలీజ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

నందిపాటి వంశీ: ‘హే భగవాన్’ నవ్విస్తుంది.. హృదయాన్ని తాకుతుంది

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాస్–నందిపాటి వంశీ జంట మరో వినోదాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్,...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, మీడియా కథనాలపై తీవ్ర విమర్శలు

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ప్రమాద సమయంలో వాహనంలో వెనుక సీటులో ఉన్న శ్రీనివాస్...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న ధీమా

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్...

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు ఓ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో కొత్త...