తాజాగా గడ్డలకొండ గణేష్ గా మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. భిన్నమైన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రిపాటి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ అన్వేషణ మొదలైంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ఖైరా అద్వానీని ఎంపిక చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగు సూపర్ హిట్టయిన అర్జున్ రెడ్డి ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసారు. షాహిద్ కపూర్ సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈ భామకు మళ్ళీ తెలుగులో ఛాన్సులు వస్తున్నాయి.
తాజాగా వరుణ్ తేజ్ కోసం ఖైరా ని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు ఆమెతో చర్చలు జరుపుతున్నాడట. అయితే ఈ సినిమా చేయడానికి ఖైరా ఆసక్తిగా ఉందట .. కానీ డేట్స్ విషయంలోనే ఆలోచనలో పడిందట. ఎందుకంటే ఇప్పటికే ఖైరా అద్వానీ హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది మరి. సో ఈ సినిమాకు ఖైరా ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాలి.
