మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన చిత్రంతో హీరోగా వైష్ణవ్ తేజ్ పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ కరోనా లేకుండా ఉంటే ఇప్పటి వరకు సినిమా విడుదల అయ్యేది.
వైష్ణవ్తేజ్ కెరీర్పై క్లారిటీ వచ్చేది. ఆయన రెండవ సినిమా కూడా అప్పుడే మొదలయ్యేది. కాని ఉప్పెన సినిమానే ఎప్పటికి విడుదల అయ్యేనో అర్థం కావడం లేదు. ఈ ఏడాది చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. అయితే ఈ సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం పాట మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఈ పాట ఆధిత్య యూట్యూబ్ ఛానెల్లో 40 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది.
ఒక కొత్త హీరో అది కూడా మొదటి సినిమా పాటను ఇంతగా ప్రేక్షకులు ఆధరించడం ఇదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే 40 మిలియన్ల వ్యూస్ను రాబట్టి దేవిశ్రీ తన మార్క్ను చాటాడు. ఈ పాటతో సినిమాపై అంచనాలు పీక్స్కు చేరాయి. పాటలో చూపించిన విజువల్స్ అద్బుతంగా ఉండటంతో పాటు హీరోయిన్ లుక్ మరియు సినిమా తెరకెక్కిన నేపథ్యం అంతా కూడా ఆకర్షణీయంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. పాట సినిమా విడుదల సమయంకు వంద మిలియన్లను కూడా చేరుకుంటుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
738287 493510Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing quite very good outcomes. In the event you know of any please share. Thanks! 759273
812523 647835I also recommend HubPages itself, and Squidoo, which is similar. 6622