ఇప్పటికే పలు దేశాల్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇండియాలో ఇటీవలే దీనికి అనుమతులు లభించాయి. ఆ విషయం అందరికి కాస్త ఊరటనిస్తుంది. ఇండియాలో ఇవ్వబోతున్న కరోనా వ్యాక్సిన్ గురించిన మరింత స్పష్టతను జాతీయ ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా పిల్లలకు మంచిదే అని.. కరోనా వైరస్ బారి నుండి వారిని కాపాడే విధంగా వ్యాక్సిన్ చేస్తుందని ఈ సందర్బంగా తెలియజేశారు.
పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ను మూడు దఫాలుగా ఇవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. పెద్దలకు ఇచ్చినట్లుగా కాకుండా పిల్లల్లో చర్మంకే వ్యాక్సిన్ ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ ను ఈనెల 20వ తారీకు నుండి పిల్లలకు ఇచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో 12 నుండి 17 ఏళ్ల వయసు వారికి ఈ వ్యాక్సిన్ ను ఇవ్వబోతున్నారు. 2 ఏళ్ల వారి నుండి ఈ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యింది. భారత్ బయోటెక్.. సీరం.. కోర్బి వ్యాక్స్ వారు ఈ టీకాలను తయారు చేయడం జరిగింది.
351319 306853I enjoy your writing style truly enjoying this internet internet site . 333189