పవన్ కళ్యాణ్ ‘వారాహి డిక్లరేషన్’లో ఏం వుండబోతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మానికి’ బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయారు. దేశవ్యాప్తంగా హిందువులంతా ఇప్పుడాయన్ని, సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్‌గానే చూస్తున్నారు మరి.!

నిన్న అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన మెట్ల మార్గంలో చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమార్తెలు ఆద్య, అంజని కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు.

పోలెనా అంజని, తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆమె తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్‌పై సంతకాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్‌నెవా దంపతుల కుమార్తె పోలెనా అంజని, క్రిస్టియన్ మత ఆచారాల్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ నిబంధనలను గౌరవించి, కుమార్తెతో డిక్లరేషన్ మీద సంతకం చేయించారు జనసేనాని పవన్ కళ్యాణ్.

మరోపక్క, రేపు తిరుపతిలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్, తన వెంట తిరుమలకు ఇప్పటికే ‘వారాహి డిక్లరేషన్’ని తీసుకెళ్ళారు. అందులో ఏముంది.? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

వారాహి బహిరంగ సభలో, వారాహి డిక్లరేషన్‌ని పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారట. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు.. డిమాండ్ ఈ డిక్లరేషన్‌లో ప్రధాన అంశం కావొచ్చన్న చర్చ అంతటా జరుగుతోంది. అలాగే, దేవాలయాలను రాజకీయాలకు దూరంగా వుంచడం, దేవాలయాలపై రాజకీయ పెత్తనం లేకుండా చేయడం.. వంటి అంశాలూ ఈ డిక్లరేషన్‌లో వుండొచ్చు.

తిరుపతిలో నిర్వహించబోయే బహిరంగ సభకు లక్షలాది జనం తరలి వస్తారన్నది నిర్వివాదాంశం. అయితే, జనసేన పార్టీ ఇప్పటిదాకా నిర్వహించిన బహిరంగ సభలన్నిటికీ మించి ఈ ‘వారాహి డిక్లరేషన్’ సభకు జనం తరలివచ్చే అవకాశం వుంది.

వారాహి డిక్లరేషన్ సభలో, జనసేన జెండాలు తక్కువ వుండేలా.. కేవలం దీన్నొక సనాతన ధర్మ పరిరక్షణ సభ తరహాలో నిర్వహించాలనే ఆలోచనలో జనసేన వున్నట్లు తెలుస్తోంది.

సినిమా

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేష రాశివారికి ఉద్యోగంలో శుభవార్తలు.. కుంభ రాశివారికి ధనలాభ సూచనలు

మే 9 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం, ఉద్యోగం,...

Daily Horoscope: కన్య రాశివారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు రాశివారికి కొత్త పరిచయాలతో లాభాలు

మే 14 , 2026 గురువారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించనుంది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం...

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

Balakrishna: బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..! స్పెషల్ సాంగ్ కు సిద్ధం..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని కూడా మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. సినిమా...

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....