అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కేందుకు రెడీ అయిన ‘పుష్ప’ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు విలన్గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి లేదా సంజయ్ దత్ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని ఐటెం సాంగ్పై ప్రచారం మొదలైంది. సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆయన కెరీర్ ఆరంభం నుండి కూడా దేవిశ్రీతో కలిసి ఐటెం విషయంలో అదరగొడుతూనే ఉన్నాడు.
సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో కూడా ఐటెం సాంగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈసారి కూడా ఏమాత్రం తగ్గవద్దని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకోసం ఈసారి ఏకంగా బాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఊర్వశి రౌతాలను ఐటెంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్లో ఇప్పటి వరకు పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు హీరోయిన్గా కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు సౌత్కు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. భారీ పారితోషికంను ఈమెకు ఆఫర్ చేశారట. దాంతో ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే. కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాను లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత కేరళలో ప్రారంభించేందుకు సుకుమార్ ఏర్పాట్లు చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్కు ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
677985 291310This was an incredible post. Actually loved studying your web site post. Your data was really informative and useful. I believe youll proceed posting and updating regularly. Looking forward to your subsequent one. 219976
281989 147873Its amazing as your other weblog posts : D, thanks for posting . 448609