Switch to English

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్: బాలకృష్ణ ‘ఊర’మాస్ వార్నింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ తాజాగా ప్రసారమైంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా చాలా తక్కువ. మామూలుగా టాక్ షో అంటే, అట్నుంచి ప్రశ్నలు వస్తాయ్.. వాటికి సమాధానాలు చెప్పాల్సి వుంటుంది. పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు. తన గురించి తాను పవన్ కళ్యాణ్ ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ తరఫున నందమూరి బాలకృష్ణ పూర్తిస్థాయిలో వకాల్తా పుచ్చుకోవడం.

‘ఇంకొకసారి ఆయన గురించి.. పెళ్ళిళ్ళ గురించీ మాట్లాడితే.. మీరు ఊర కుక్కలతో సమానం..’ అంటూ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ఊర మాస్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఈ వార్నింగ్ ఎవరికి.? ఇంకెవరికి వైసీపీ నేతలకి. వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకులకు కూడా. అదేంటీ, నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేనే కదా.? అయినాసరే, పవన్ కళ్యాన్ వ్యక్తిత్వానికి నందమూరి బాలకృష్ణ ఫిదా అయ్యారు. అదీ అసలు సంగతి.

బహుశా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇంత గొప్పగా చెప్పి వుండరేమో.. అనేంతలా ఎపిసోడ్ అంతటా వీలు చిక్కినప్పుడల్లా బాలకృష్ణ చెబుతూనే వున్నారు.

కాగా, ‘నేను మూడు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోలేదు.. ముగ్గురితో ఒకేసారి సంసారం చెయ్యలేదు. వ్యామోహంతో పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అనుకోకుండా జరిగాయంతే.. అదీ చట్టబద్ధంగా విడాకుల తర్వాతనే..’ అంటూ పవన్ కళ్యాణ్, మూడు పెళ్ళిళ్ళపై బాలకృష్ణ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

రాజకీయాల గురించి ఎవరితో చర్చిస్తారు.? అనడిగితే, ‘నాలో నేనే చర్చించుకుంటాను. పుస్తకాలు చదువుతాను. రాజకీయాలకు సంబంధించి ఏ సందేహం వచ్చినా.. అంబేద్కర్, కాన్షీరాం లాంటి గొప్ప నాయకులు చెప్పిన విషయాలను చదవడం ద్వారా ఆ సందేహాల్ని తీర్చుకుంటాను..’ అని చెప్పారు పవన్ కళ్యాణ్.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో స్నేహం చేయాల్సి వచ్చిందని చెప్పిన పవన్ కళ్యాణ్, ‘ఆయన నాకు స్నేహితుడు అనడం కంటే.. గురువు అనడం కరెక్టేమో..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని విని, నందమూరి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. ‘దర్శకుడికి గురువు స్థానం ఇచ్చిన మీ గొప్ప మనసుకి నేను ఫిదా అయిపోయాను..’ అన్నారు బాలకృష్ణ.

ఓ సందర్భంలో, ‘నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఈ క్షణం నుంచి నీ మీద నాకు గౌరవం మరింత పెరిగింది..’ అంటూ బాలకృష్ణ చెప్పడం మరో ఆసక్తికరమైన సందర్భం. ‘తొలిప్రేమ’ సినిమాకి తొలుత రెమ్యునరేషన్ ఇవ్వలేదనీ, తాను తీసుకోలేదనీ, సినిమా 100 రోజులు ఆడాక రెమ్యునరేషన్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

‘గబ్బర్ సింగ్’ సినిమాకి రెమ్యునరేషన్ గట్టిగా ఇచ్చారా.? అంటే, నేను అడిగినంత ఇవ్వలేదు.. ఆయన (బండ్ల గణేష్) ఇవ్వాలనుకున్నంత ఇచ్చారు.. అని పవన్ చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

దీనిపై బండ్ల గణేష్ ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నకు బదులిస్తూ, ‘భగవంతుడు అడగడు.. భక్తుడు ఇస్తాడు..’ అంటూ స్పందించడం విశేషం.

అన్నట్టు, ఎపిసోడ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ‘సాయి ధరమ్ తేజ్ సహా, చిరంజీవిగారి కుటుంబంలో పిల్లలందరికీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు వచ్చాయి..’ అని బాలక‌ృష్ణ చెప్పారు. ‘వారు పెరిగిన వాతావరణం అలాంటిది..’ అని చెప్పిన పవన్ కళ్యాణ్, ‘వారు ఎవరికైనా గౌరవం ఇచ్చారంటే అది నిజం.. అందులో నటన వుండదు..’ అని పేర్కొన్నారు.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ‘‘మూడు రోజుల వరకు డాక్టర్లు ‘ఏమీ చెప్పలేం’ అన్నారు. ఆ క్షణం చాలా బాధ కలిగింది. సాధారణ యాక్సిడెంట్ అయినా.. రకరకాల పిచ్చి ప్రచారాలు జరిగాయి.. అవి మరింత బాధ కలిగించాయి..’ అని అన్నారు.

పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ (మెడ మీద చేతిని రుద్దడం), బాలకృష్ణ సిగ్నేచర్ (తొడ కొట్టడం).. వీటి గురించి బోల్డంత ఫన్ నడిచింది. పెళ్ళి గురించి సాయి ధరమ్ తేజ్‌ని బాలయ్య అడిగితే, ‘చేసుకుంటాడు తప్పకుండా’ అని పవన్ చెప్పారు. సాయి ధరమ్ తేజ్ మాత్రం, ‘మొన్నే ప్రమాదం నుంచి బయటపడ్డా.. మరో ప్రమాదమా.?’ అంటూ బాలయ్యతో చెప్పాడు.

మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రెండో ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా వుండబోతోంది. పవన్ కళ్యాణ్ బాల్యం, సినిమాల్లోకి రాకముందు విషయాలు.. ఇవన్నీ వచ్చే ఎపిసోడ్‌లో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...