ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ మూసివేశారు. గత 70 రోజుల నుండి థియేటర్లు తెరుచుకోవట్లేదు. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశముంది. థియేటర్లు త్వరలో తెరుచుకున్నా కానీ ప్రేక్షకులు ఎంత వరకూ థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతారన్నది తెలియకుండా ఉంది. కరోనా వైరస్ భయం వాళ్ళను ఇంకా వెంటాడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
దానికి తోడు ఒకవేళ థియేటర్లు తెరిచినా ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించే అవకాశముంది. థియేటర్లలో సీట్ల సంఖ్యను తగ్గించడం, షో ల సంఖ్యను తగ్గించడం వంటివి చేయవచ్చు. ఈ రెండు కారణాలతో లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే సినిమాలకు రెవిన్యూ భారీగా తగ్గే అవకాశముంది.
పైగా థియేటర్లు ఓపెన్ అయినా క్యూలో చాలా సినిమాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అన్నది చాలా సౌకర్యంగా ఉంది. సరైన డేట్ చూసుకుని రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఇదే రూట్ లో బాహుబలి నిర్మాతలు వెళుతున్నారని అర్ధమవుతోంది.
బాహుబలి తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇప్పుడు రేంజ్ బాగా తగ్గించేశారు. లిమిటెడ్ బడ్జెట్ లో తమ తర్వాతి సినిమాను రూపొందించారు. సత్యదేవ్ హీరోగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాను నిర్మించారు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళంలో మంచి విజయం సాధించిన మహేషింటి ప్రతీకారమ్ కు ఈ చిత్రం రీమేక్.
ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ ఓటిటిలో విడుదలవబోతున్నట్లు తెలుస్తోంది. మంచి లాభానికే నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థకు సినిమాను అమ్మేసారట. త్వరలో రిలీజ్ డేట్ ఇస్తారని తెలుస్తోంది.
121157 704724quite nice post, i definitely adore this site, keep on it 835942
973427 819596In case you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to help make distinctive baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc free of charge mommy weblog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 894090