కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో బోలేగావూన్ ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే విద్యామన్ బరందే లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటివలే గుజరాత్ నుంచి సొంత ప్రాంతానికి వచ్చాడు. అసలే కరోనా సమయం కావడంతో విద్యామన్ ను క్వారంటైన్లో ఉండమని మరో స్థానికుడు షాహాజీ పాటిల్ సూచించాడు. ఇందుకు విద్యామన్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
దీంతో ఆగ్రహించిన విద్యామన్ పక్క ఊరు చండోరిలోని తన సోదరి నివాసానికి వెళ్లాడు. జరిగిన విషయం చెప్పి కొంతమంది గ్రామస్థులతో బోలేగావూన్ కి తిరిగొచ్చాడు. ఆవేశంలో ఉన్న వారంతా కలిసి షాహాజీ పాటిల్ ని వెతుక్కుంటూ వెళ్లారు. ఓ చోట తన బంధువుతో కలిసి మాట్లాడుతున్న పాటిల్ పై వీరంతా కలిసి దాడికి పాల్పడ్డారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో వారు అక్కడే తీవ్రగాయాలతో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో 8మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
139909 414132Aw, this was a very good post. In thought I want to put in writing like this moreover ?taking time and actual effort to make a quite good post?even so what can I say?I procrastinate alot and definitely not appear to get 1 thing done. 666852