కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది ఇంటి నుంచే పని చేయడం. ఇప్పటివరకు ఐటీ రంగంలో మాత్రమే ఉన్న ఈ వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఇప్పుడు చాలా రంగాల్లో అమలవుతోంది. ఆఫీసుకు వచ్చి పని చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంటి నుంచే పనిచేయడానికి అవకాశం ఉన్న చాలా సంస్థలు ఈ వెసులుబాటును కల్పించాయి. కరోనా ఓ కొలిక్కి వచ్చేంతవరకు ఈ సౌకర్యం ఉంటుంది.
అయితే, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు కోరుకుంటే ఇక ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు తగిన మార్పులు చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు.. మరికొంతకాలం ఈ విధానాన్ని పొడిగించాలని కోరారు. దీంతో తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ జాక్ డోర్సే తమ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తమ కార్యాలయాలు తెరిచేది లేదని, అప్పుడు పరిస్థితిని సమీక్షించిన తర్వాత కార్యాలయాలు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించిన ట్విట్టర్ పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్ కూడా ఈ ఏడాది చివరి వరకు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడానికి అవకాశం కల్పించాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈనెల 22న సెలవు కూడా ఇచ్చాయి. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్ ఏకంగా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించి.. ఈ వెసులుబాటు ఇచ్చిన తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది.
487555 414375Some times its a discomfort inside the ass to read what weblog owners wrote but this web site is really user friendly ! . 675218
598109 437885It can be tough to write about this subject. I believe you did an exceptional job though! Thanks for this! 975953
251206 609854I recognize there exists a lot of spam on this weblog. Do you want support cleansing them up? I may possibly assist amongst courses! 469675
256236 988606There is visibly a bunch to know about this. I believe you made various good points in features also. 410804