YS Avinash Reddy: మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy) యాంటిసిపేటరీ బెయిల్ విచారణపై తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. తమ వాదనలు వినిపించడానికి ఎంత సమయం కావాలని సిబిఐ( CBI) తరపు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గంట సమయం కావాలని సిబిఐ తరపు లాయర్లు చెప్పగా.. విచారణను రేపు ఉదయానికి వాయిదా వేసింది. దీంతో ఈ పిటిషన్ రేపు ఉదయం 10:30 గంటలకు విచారణకు రానుంది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై ఈరోజు స్పష్టత వస్తుందని అందరూ భావించారు. సుప్రీంకోర్టు సైతం ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని.. తెలంగాణ హైకోర్టును విచారణ ఈరోజే ముగించాలని చెప్పడంతో.. సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు అంగీకరిస్తుందా? లేదా తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే తదుపరి సిబిఐ ఏం చేయనుందన్న సస్పెన్స్ నెలకొంది. కానీ విచారణను రేపటికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది.
వివేక హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ని విచారణకు రావాల్సిందిగా సిబిఐ పలుమార్లు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వివిధ కారణాలను చూపుతూ అవినాష్ విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈనెల 22న విచారణకు రావాలని మరోసారి ఆదేశించగా.. అప్పుడు అవినాష్ హాజరు కాలేదు. దీంతో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ కు సిబిఐ చేరుకుంది. అప్పటి నుంచి అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేయడంతో ఈ ఉత్కంఠ రేపటి వరకు కొనసాగనుంది.