తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 13న వైకుంఠ ఏకాదశి, 14న ద్వాదశితోపాటు మిగిలిన 8 రోజులు, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అధికా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు ఉండేలా చూడాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ.. భక్తులు, ఉద్యోగులు విధిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను భక్తులకు తెలియజేసేలా, అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
32718 666944Billiard is really a game which is mostly played by the high class individuals 238240
154031 111483Hey there! Wonderful stuff, please do tell us when you post once more something related! 639926