కాపు సామాజికవర్గ సంక్షేమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో ‘శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ భవనం’ కోసం రెండు ఎకరాల స్థలం కేటయించింది. దీంతో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాపు పెద్దల సమక్షంలో భూమి పూజ నిర్వహించి.. ‘శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ’ ప్రతిష్ట చేశారు.
ఈ కార్యక్రమంలో బిల్డర్, కాపు సంఘం నాయకులు యాళ్ల వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1లక్ష విరాళం ప్రకటించారు. కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కాపు భవన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గాజులరామారం శ్రీకృష్ణదేవరాయ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, కార్పొరేటర్ రావుల శేషగిరి, అధ్యక్షులు ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ రవికాంత్ తోపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
965632 41858Thanks for all your efforts that you have put in this. extremely fascinating info . 181045