కరోనా వైరస్ని బూచిగా చూపి తెలుగు మీడియాలో జర్నలిస్టులు, ఇతర సిబ్బందిపై ‘వేటు’ జరుగుతోందంటూ పెద్దయెత్తున కథనాలు హల్చల్ చేస్తున్నాయి. సాక్షాత్తూ బాధిత జర్నలిస్టులే సోషల్ మీడియా వేదికగా ఈ తరహా ఆవేదన వెల్లగక్కుతుండడం గమనార్హం. వ్యవహారం బయటకు పొక్కడంతో కొన్ని మీడియా సంస్థలు ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలకు దిగాయి. మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం, తమ పని తాము చేసుకుపోతున్నాయి ‘వేటు’ విషయంలో.
ఇక, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనం ప్రకారం, ఈనాడు, సాక్షి సహా పలు ప్రధాన మీడియా సంస్థల్లో ఇంకా ‘వేటు’ వ్యవహారం ముందుకు కదలడంలేదట. నిజానికి, ‘వేటు’ దిశగా ఇప్పటికే నిర్ణయాలు జరిగినా, ప్రస్తుతానికి ‘హోల్డ్’లో పెట్టారని తెలుస్తోంది. ఈ మేరకు కొత్తగా ఇంకో సోషల్ మీడియా పోస్ట్ దర్శనమిస్తోంది. మరోపక్క, ఆంధ్రజ్యోతికి సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనం నిజమేనట. దాదాపు 100 మందిని ఆ మీడియా సంస్థ తొలగించిందని చెబుతున్నారు. వున్న సిబ్బంది వేతనాల్లోనూ కోత విధించారట.
కొందరికి ‘ప్యాకేజీ’ల పేరుతో కామప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ అనేది కేవలం ఓ ‘కుంటి సాకు’ మాత్రమేననీ, సిబ్బందిని తగ్గించుకునే దిశగా దాదాపు అన్ని మీడియా సంస్థలూ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.కారణాలు ఏవైనాగానీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం, మీడియా విలువల కోసం పదే పదే మాట్లాడే మీడియా సంస్థలు, వాటి అధిపతులు.. కష్ట కాలంలో తమ ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం. ఎన్నో ఏళ్ళుగా ఆయా సంస్థల్ని నమ్ముకున్నవారిని యాజమాన్యాలు నట్టేట్లో ముంచడాన్ని సీనియర్ జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.
609721 697711Yay google is my world beater helped me to find this wonderful internet website ! . 837399