గత సంవత్సరం ట్రూకాలర్ నుండి భారతీయుల డేటా చౌర్యానికి గురి అయ్యింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. దాంతో ఆ విషయం అప్పటితో ముగిసింది. కానీ మరోసారి ట్రూకాలర్ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ట్రూకాలర్ వినియోగదారులుగా ఉన్న నాలుగున్నర కోట్ల మంది భారతీయుల వివరాలను హ్యాకర్లు దొంగిలించారట.
ట్రూకాలర్ సెక్యూరిటీ విషయంలో మరోసారి అనుమానాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ట్రూకాలర్ ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఇండియన్ టెక్కీ లు అంటున్నారు. అందుకే ఇకపై అయినా ట్రూకాలర్ ను ఇండియన్స్ వదిలేస్తే బాగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్రూకాలర్ అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఒక్కరి డేటా కూడా చోర్యం కాలేదని పేర్కొన్నారు.
