అప్పుడు వద్దన్న పార్టీలే ఇప్పుడు ముద్దొచ్చాయ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,105FansLike
57,764FollowersFollow

హుజూర్ నగర్ ఉప ఎన్నికలను తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హస్తం కోటలో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్.. అన్ని విషయాల్లోనూ తగిన సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడా కూడగడుతుండటం విశేషం.

ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన పార్టీల అండ కోరుతున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలను కలిసి వారి మద్దతు సంపాదించిన టీఆర్ఎస్.. తాజాగా వైఎస్సార్ సీపీని మద్దతు ఇవ్వాలని కోరింది. ఇందుకు ఆ పార్టీ సైతం అంగీకారం తెలిపింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తాము అధికార పార్టీకి మద్దతిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవల కేసీఆర్ సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించి మద్దతు అడిగారు.

ఇప్పటికే పలు అంశాల్లో ఇరువురు సీఎంలు కలిసి సాగుతున్న తరుణంలో జగన్ ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గట్టు వద్దకు పల్లా రాజేశ్వరరెడ్డి వెళ్లి తమకు అనుకూలంగా ప్రకటన చేయించుకున్నారు. ఒకప్పుడు సీపీఐని, వైఎస్సార్ సీపీని టీఆర్ఎస్ నేతలు విపరీతంగా విమర్శించారు. వైఎస్సార్ సీపీ అయితే ఆంధ్రా పార్టీ అంటూ పలుమార్లు ధ్వజమెత్తారు. కానీ అనంతరం కాలంలో మారిన పరిణామాల నేపథ్యంలో జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యాయి. ఎన్నికల్లో ఒకరికొకరు సాయం చేసుకున్నారు.

తాజాగా హుజూర్ నగర్ బరిలో వైఎస్సార్ సీపీ మద్దతు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఓ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనే అభిప్రాయం ప్రబలుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోటలో జెండా ఎగురేసి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఫలితంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. అందుకే అప్పడు విమర్శించిన పార్టీలను ఇప్పుడు మచ్చిక చేసుకుంటోంది. రాజకీయాలంటే అంతే మరి.

9 COMMENTS

సినిమా

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌...

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

రాజకీయం

అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తల ప్రశంసలు… రాజకీయంగా ఆసక్తికర మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లపై మరోసారి చర్చ మొదలైంది. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లపై ఈసారి వైసీపీ కార్యకర్తల నుంచే ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది. “అన్న క్యాంటీన్‌లో...

“ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద మార్పులు”: మౌలిక సదుపాయాలపై లోకేష్ ఫోకస్

అమరావతిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాల పెంపు, విద్యా నాణ్యతపై కీలక ఆదేశాలు జారీ చేశారు....

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

ఎక్కువ చదివినవి

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు...

వివాహం పేరుతో వల… 67 మంది యువతులను మోసం చేసిన నకిలీ అధికారి అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారిగా వేషధారణలో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నిందితుడు బాలకృష్ణగా గుర్తించిన పోలీసులు, అతడు చేసిన మోసాల వివరాలు వెలుగులోకి రావడంతో షాక్‌కు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్...

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా ఉందంటూ ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది....

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే నిహారిక వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని...