తెలంగాణను ప్రస్తుతం హీటెక్కిస్తున్న అంశాల్లో మునుగోడు ఉపఎన్నిక ఒకటి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా.. నవంబర్ 2న పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు నోటిఫికేషన్ కూడా వెలువరించింది.
ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించింది. 2014లో టీఆర్ఎస్ తరపున విజయం సాధించి, 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ చర్చలు, ఎందరో నేతల ప్రయత్నాల అనంతరం పార్టీ కూసుకుంట్ల వైపు మొగ్గు చూపింది.
మరోవైపు.. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ప్రకటించగా.. బీజేపీ తమ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేసినా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
392722 275997bless you with regard towards the certain weblog post ive genuinely been searching regarding this kind of info on the internet for sum time appropriate now as a result cheers 166763
965008 572545Hi my loved one! I wish to say that this post is incredible, fantastic written and come with almost all crucial infos. I would like to see a lot more posts like this . 718850