వైఎస్ జగన్ పై క్విడ్ ప్రోకో… అక్రమాస్తుల కేసులు ఎన్నో ఉన్నాయి. అన్నింట్లో కూడా మొదటి ముద్దాయిగా జగన్ ఉన్నారు. ఈ కేసులకు సంబంధించిన విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్నది. రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత నుంచి ఈ కేసు నడుస్తూనే ఉన్నది. ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. విచారణ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియదు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు.
ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారే కోర్టుకు వచ్చారు. ఆ తరువాత మరలా వెళ్ళలేదు. ఈ కేసులో జగన్ బెయిలు మాత్రమే మంజూరు అయ్యింది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన బెయిలును కోర్టు క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటి. మరలా జైలుకు వెళ్లాల్సిందేనా లేదంటే మరలా బెయిల్ తెచ్చుకోవాలా? ఈ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు జగన్ పై కొన్ని మీమ్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. మంగళవారం అంటే ఫిబ్రవరి 25 వ తేదీన ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యమ్రమానికి 95 మంది అతిధులను ఆహ్వానిస్తున్నారు. ఈ 95 మందిలో జగన్ స్నేహితుడు, సహచర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ కు ఆహ్వానం అందడంతో, అయన ట్రంప్ కోసం కొన్ని స్పెషల్ రెసిపీలు తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
కానీ, జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, కేసీఆర్ కంటే కూడా కేంద్రానికి జగన్ దగ్గరగా ఉన్నారు. బీజేపీతో త్వరలోనే చేతులు కలుపుతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ను పక్కన పెట్టి కేసీఆర్ కు ఆహ్వానం పలకడంతో వైకాపా నేతలు షాక్ అవుతున్నారు. దీనిపై కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మమ్మల్ని సీబీఐ తప్ప మరెవ్వరు పిలవరు అని కొన్ని మీమ్స్ విపరీతంగా షేర్ అవుతున్నాయి.
102718 153994I like your writing style actually loving this internet website . 759046