పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సిటీ పేపర్ లీక్, ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో సినిమా ప్రత్యేక ప్రదర్శన చూడిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ – “మన సమాజంలో నొక్కబడే గొంతుల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. ఆర్ నారాయణ మూర్తి గారు అలాంటి గొంతుకల ప్రతినిధి. ఈ సినిమా చూస్తే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లిదండ్రులు పడుతున్న ఒత్తిడులు బలంగా కనిపిస్తాయి. పేపర్ లీక్లు, విద్యా భాష, ఉద్యోగాల కోసం జరిగే పోటీ, అవినీతి – ఇవన్నీ ఆలోచింప చేసే అంశాలు. అయినప్పటికీ సినిమా ఆసక్తికరంగా సాగింది. నారాయణ మూర్తి గారి సిన్సియారిటీ, నిబద్ధత గౌరవించదగ్గవి. ఇలాంటి సినిమాలు తప్పక థియేటర్లో చూడాలి” అన్నారు.
అలాగే, ఈ సినిమాలో గద్దర్ రాసిన తాత తాత ముత్తాతలు పాట తనకు బాగా నచ్చిందని త్రివిక్రమ్ తెలిపారు. “విద్య ఆనందం ఇవ్వాలి, బాధ కాదు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు తమ వర్తమానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మన సమాజంలో ఉంది. ఇది సినిమా బలంగా చూపించింది” అని అన్నారు.
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ – “త్రివిక్రమ్ గారు చూసి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. విద్యను ప్రైవేట్ మాఫియా నుండి విముక్తి చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సినిమా చెబుతుంది. ఆగస్టు 22న విడుదల కానున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి” అని కోరారు.
