Trisha: సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజుల్లో దాదాపు 25ఏళ్లుగా హీరోయిన్ గా రాణించడమంటే ఆషామాషీ కాదు. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్న అతితక్కువ హీరోయిన్లలో ఒకరు ‘త్రిష’. చెన్నై చందమామగా పిలిపించుకుని ఓదశలో తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గానూ రాణించారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ఏకంగా లక్కీచార్మ్ అనిపించుకుంటున్నారు. ఇటివలే ఆమె నటించిన తమిళ సినిమా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సెన్సేషనల్ హిట్ అయింది.
ఇప్పుడిదే త్రిషను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. తమిళంలో ముగ్గురు స్టార్ హీరోలతో ఆమె నటించిన రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ ఆయా హీరోల కెరీర్లో బ్లాక్ బస్టర్స్ గా, హయ్యస్ట్ రెవెన్యూ సినిమాలుగా నిలవడంతో అందరూ త్రిషను లక్కీ చార్మ్ గా పిలుస్తున్నారు. ఓ అభిమాని ఈ విషయాన్ని ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో త్రిష సైతం స్పందించారు. ఈ పోస్ట్ ను త్రిష తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి లవ్ ఎమోజీతో థ్యాంక్స్ చెప్పారు.
2023లో విజయ్ తో ఆమె నటించిన ‘లియో’ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఏకంగా రూ.600కోట్లు వసూలు చేసిందని టీమ్ ఆమధ్య ప్రకటించింది.
2025లో అజిత్ తో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈసినిమా దాదాపు 250కోట్లు వసూలు చేసిన అజిత్ కెరీర్ హయ్యస్ట్ గా నిలిచింది.
2026లో సూర్య నటించిన సినిమా కరుప్పు. వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్యకు ఈ సినిమా సూపర్ హిట్టై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రూ.300కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోందని టాక్.
ఇలా ఈ హీరోలందరికీ వారి కెరీర్ హయ్యస్ట్ రెవెన్యూ సినిమాలో హీరోయిన్ త్రిష కావడం విశేషం. దీంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో త్రిష ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
