సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై పెండింగ్ బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ అధికారులు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటివల రవాణా మంత్రి సమావేశంలో అధికారులు ఈ విషయమై విన్నవించారు. ఒంగోలు తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పాత బకాయిలు తీర్చాలని కోరారు. వీఐపీల కాన్వాయ్లకు ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమని అధికారులు లేఖలో వివరించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించాలని.. ప్రత్యేక ఖాతా ద్వారా బిల్లులు చెల్లించాలని కోరారు.
ఇప్పటివరకూ పేరుకుపోయిన మూడేళ్ల బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని లేఖ రాశారు. కాన్వాయ్ వాహనాల ఏర్పాటుకు తక్షణం బిల్లులు చెల్లించాలని కోరారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే సీఎం, ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని లేఖలో స్పష్టం చేశారు. ఇటివల ఒంగోలులో తిరుమల వెళ్తున్న ఓ కుటుంబానికి చెందిన కారును సీఎం పర్యటన పేరుతో అధికారులు తీసుకెళ్లడం విమర్శలపాలైన సంగతి తెలిసిందే.
407034 458033I observe there is really a lot of spam on this blog. Do you want assist cleaning them up? I might support in between courses! 199701
27674 890244What a lovely blog page. I will undoubtedly be back once more. Please maintain writing! 707718
776072 968371I actually got into this post. I discovered it to be fascinating and loaded with unique points of interest. I like to read material that makes me think. Thank you for writing this fantastic content. 755179