వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వడ్డే జిష్ణు సమర్పణలో, వడ్డే క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లేను వడ్డే నవీన్ అందించారు. రాశీ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు.
వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా నిలిచారు. ఆయన స్థాపించిన విజయ మాధవి కంబైన్స్ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అదే బాటలో వడ్డే నవీన్ వడ్డే క్రియేషన్స్ను స్థాపించి చిత్రాలు నిర్మించేందుకు ముందుకొచ్చారు.
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ బ్యానర్లో రూపొందుతున్న మొదటి సినిమా. ఈ చిత్రం షూటింగ్ 2025 మే 15న ప్రారంభమై ఇప్పటివరకు దాదాపు 80 శాతం పూర్తయింది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్లో కామెడీ టచ్ కనిపిస్తోంది.
ఈ చిత్రంలో వడ్డే నవీన్, రాశీ సింగ్తో పాటు రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు నటిస్తున్నారు.
