ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ చలానాల్ని విధించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ‘ఇదెక్కడి అన్యాయం.?’ అంటూ జనం ప్రశ్నిస్తున్న వేళ మంత్రి పేర్ని నాని, విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘మా ప్రభుత్వానికి ప్రాణం విలువ బాగా తెలుసు.. అందుకే, ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకే జరీమానాల్ని భారీగా పెంచాం. వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మా ప్రభుత్వానికి, 150 కోట్లు అదనంగా ట్రాఫిక్ చలానాలతో వస్తే.. దాని మీద ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తాం.? ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే, చలానాలతో సమస్య వుండదు..’ అని పేర్ని నాని సెలవిచ్చారు.
ప్రజారోగ్యం మీద ప్రభుత్వానికి నిజంగానే అంత శ్రద్ధ వుంటే, ప్రజల ప్రాణాల పట్ల అంతటి బాధ్యత వుంటే, కరోనా సమయంలో లిక్కర్ షాపుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తెరిచిందట.? పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున అక్రమ మద్యం తరలి వచ్చేలా, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ధరల్ని ఎందుకు పెంచిందట.? ఏమో మరి, ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. జనసేన నేత ఒకరు ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావ్.? అనడిగితే, దూడకి గడ్డి కోసం..’ అన్నట్టుందంటూ సెటైర్ వేశారు. నిజమే మరి, ట్రాఫిక్ చలాన్లను పెంచింది ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకుని అట. యాక్సిడెంట్లలో జనం పోవడం సంగతి దేవుడెరుగు.. ట్రాఫిక్ చలానా కట్టాల్సి వస్తే, జనం గుండె ఆగిపోయేలా వుంది పరిస్థితి.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
సంక్షేమ పథకాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం, అభివృద్ధిని అటకెక్కించేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది. దాంతో, ఖజానా నింపుకోవడానికి రకరకాల మార్గాల్ని జగన్ సర్కార్ అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ట్రాఫిక్ చలానాల పెంపు. పెట్రో ఉత్పత్తులపై వడ్డన, పలు రకాల ట్యాక్స్ల పెంపు.. ఇవన్నీ ‘ప్రజల పట్ల బాధ్యత’ అని ప్రభుత్వం చెప్పగలదా.?
449057 1082Generally I dont learn post on blogs, however I wish to say that this write-up very pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite wonderful write-up. 689942
161813 19291There is noticeably a lot of funds to comprehend about this. I suppose you made certain good points in functions also. 829405
812945 738830This plot doesnt reveal itself; it has to be explained. 373553