Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: పవన్ కళ్యాణ్ కంటతడి.. పైకి మాత్రం కనపడనీయలేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

ఏడేళ్ళ కుమారుడు, అపస్మారక స్థితిలో వున్నాడంటే, ఏ తండ్రికైనా అది గుండె పగిలేంత కష్టం. పైగా, చాలా దూరంలో ఆసుపత్రిలో కుమారుడు చికిత్స పొందుతున్నాడంటే, అది తట్టుకోలేనంత కష్టం.

మామూలుగా అయితే, వున్నపళంగా.. కొడుకుని చూసేందుకు వెళ్ళిపోతాడు ఏ తండ్రి అయినా. ఆయన కేవలం ఏడేళ్ళ తనయుడికి తండ్రి మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా.

సింగపూర్‌లో, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సమ్మర్ క్యాంప్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా వున్నాడు. హుటాహుటిన క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అధికారులు, వెంటనే పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసేందుకు చర్యలు చేపడుతుండగా, వారిని పవన్ కళ్యాణ్ వారించారు. గిరిజన గ్రామాలకు చెందిన అభివృద్ధి పనులు కావడంతో, పవన్ కళ్యాణ్.. ఆ పనులు పూర్తి చేయాలనే అనుకున్నారు.

కొందరు మీడియా ప్రతినిథులు కూడా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారిక పర్యటనలు సబబు కాదని కూడా, సీనియర్ జర్నలిస్టులు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ద్వారా పవన్ కళ్యాణ్‌కి సూచించారు.

మరోపక్క, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, పలువురు శ్రేయోభిలాషులు, పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకుని, వెంటనే సింగపూర్ వెళ్ళాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌కి చెప్పారట.

అయినాగానీ, పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారిక కార్యక్రమాల్ని దాదాపుగా పూర్తి చేసుకున్నాకే, కుమారుడిని చూసేందుకోసం విమానమెక్కారు. హైద్రాబాద్ చేరుకుని, మీడియాకి సమాచారమిచ్చి, పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి బయల్దేరారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు. జనంలో వున్నంత సేపూ హుషారుగానే పైకి కనిపించినా, లోలోపల తనయుడి ఆరోగ్య పరిస్థితి గురించి బాధపడుతూనే వున్నారు పవన్ కళ్యాణ్. ‘ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు’ అని పవన్ కళ్యాణ్‌ని దగ్గరుండి చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇలాంటి నిబద్ధత గల పొలిటీషియిన్‌ని, తన కెరీర్‌లో ఇంతవరకూ చూడలేదని ఓ సీనియర్ జర్నలిస్టు, తోటి జర్నలిస్టుల వద్ద కామెంట్ చేశారు.

ఓ వైపు, జెఇఇ మెయిన్స్ విద్యార్థుల రగడ, ఇంకో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోపక్క పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరానందన్ పుట్టినరోజు, అదే సమయంలో చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురి కావడం.. వెరసి, పవన్ కళ్యాణ్ చాలా చాలా భిన్నమైన ఛాలెంజెస్‌ని ఒకేసారి చూడాల్సి వచ్చింది.

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళం: జనసేన కొత్త సభ్యత్వానికి శ్రీకారం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి...

సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం: లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తెరకెక్కిన ‘సతీ లీలావతి’ సినిమా మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్...

ఆలయాల పరిరక్షణకు పాలక మండళ్ల బాధ్యతపై పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఆలయాల్లో అపచారాలు చోటుచేసుకునే పరిస్థితి ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని...

రాజమౌళి చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ టీజర్ విడుదల

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...