ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. తాజాగా, 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదవడంతో, మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరుకుంది. అయితే, 524 మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 33 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కొత్త కేసుల విషయానికొస్తే, కర్నూలులో 25 కేసులు నమోదయ్యాయి 24 గంటల్లో. దీంతో కర్నూలులో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 491కి చేరుకోవడం గమనార్హం. కర్నూలు తర్వాతి స్థానంలో వున్న గుంటూరులో కొత్తగా 19 కేసులు నమోదు కాగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 338. కృష్ణా జిల్లాలో 24 గంటల్లో కొత్తగా 12 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 278గా వుంది.
విశాఖపట్నంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లే కొద్ది రోజులు కన్పించినా, తిరిగి అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పుంజుకుంటోంది. తాజాగా నమోదైన 6 కేసులతో మొత్తంగా విశాఖలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కి చేరింది. విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
చిత్తూరు జిల్లాలో కొత్తగా ఓ కేసు నమోదయ్యింది. కడపలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, 24 గంటల్లో మొత్తం 10,292 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1093గా వుంది.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా కరోనా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెబుతున్న విషయం విదితమే. టెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని సమర్థించుకోవడానికి వీల్లేని పరిస్థితి. 50 రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా కేసుల నమోదు ఆగడంలేదంటే.. సడలింపుల తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశాలుంటాయి.
ఇదిలా వుంటే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా వుందని అధికార యంత్రాంగం చెబుతోంది. మరోపక్క, కొత్త కేసుల నమోదు పెరుగుతుండడంతో ఆయా జిల్లాల్లో ప్రజానీకం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
156023 267381Wonderful post, I conceive site owners should learn a lot from this web weblog its rattling user genial . 537497
251104 955366How a lot of an significant content material, maintain on penning significant other 647009