21 వేలు – కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీదపడి నేటి వరకూ బలితీసుకున్న ప్రాణాలు.. దీని కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది.. దాని కారణంగా సామాన్య ప్రజలు కొందరు ఫుడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుతవం వీలైనంత సాయం చేస్తున్నా ఫండ్స్ సరిపోవడం లేదు.
దేశం లేదా మన రాష్ట్రాలకి ఎప్పుడు గడ్డు కాలం వచ్చినా మనం అభిమానించే సినిమా తారలు ఒక్కటై ప్రజలకి వీలైనంత సహాయసహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇరు తెలుగు రాష్ట్రాలు లోటు బడ్జెట్ లో ఉండడం చూసి తారలు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాష్ట్ర – కేంద్ర ప్రభుత్వాలకి సాయం చేస్తున్న స్టార్స్ మరియు వారు ఎంత డొనేట్ చేశారు అనే క్లియర్ లిస్ట్ మీకోసం.
>> హారిక హాసినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వారు ఇరు తెలుగు రాష్ట్రాలకి చెరొక 10 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.
We appreciate all the efforts done by our leaders & public who are supporting them by staying at home. A small helping hand from our end as well.
Let's battle #COVID2019 together. Stay Home. Stay Healthy.@TelanganaCMO @AndhraPradeshCM #IndiaFightsCorona pic.twitter.com/Be9PYOlTfY
— Haarika & Hassine Creations (@haarikahassine) March 27, 2020
>> క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కరోనా నిర్మూళన కోసం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకు 10లక్షల రూపాయలు డొనేట్ చేశారు.
>> స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రోనా నిర్మూళన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కి కలిపి 1.25 కోట్లు డొనేట్ చేశారు. అందులో ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకి చెరొక 50 లక్షలు మరియు కేరళకి 25 లక్షలు వెళ్తుంది.
>> సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ హైదరాబాద్ అండ్ చెన్నైలోని మ్యూసిషన్స్ వెల్ ఫేర్ కి 5 లక్షలు విరాళంగా అందించారు.
>> యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొద్ది సేపటి క్రితమే పీఎం రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. ఈ రోజు(మార్చ్ 26న) ఉదయం ప్రభాస్ ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కరోనా పై పోరాడటానికి ప్రభాస్ 4 కోట్లు మొత్తంగా డొనేట్ చేశారు.
>> కరోనా వైరస్ నిర్మూలన సహాయార్థం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధి కి 50 లక్షల రూపాయల విరాళంగానూ, అలాగే మరో 25 లక్షలు పనిలేక ఇబ్బంది పడుతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కోసం డొనేట్ చేశారు.
>> కరోనా వైరస్ నిర్మూలన కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
>> సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన వంతు సాయంగా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహాయ నిధికి 10 లక్షలు విరాళం ఇచ్చారు.
We are waging a crucial battle against an enemy like no other. We are in it together & we need reinforcements to come out victorious from this. I would like to contribute an amount of 10 Lakhs towards the fund of @TelanganaCMO & @AndhraPradeshCM. Stay home, Stay safe. @KTRTRS pic.twitter.com/WBrCEoiS3K
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 26, 2020
>> అల్లరి నరేష్ సరికొత్తగా అలోచించి తన ‘నాంది’ టీం కోసం పని చేస్తూ, ప్రస్తుతం పని లేక ఇబ్బంది పడుతున్న ప్రతి టీం మెంబర్ కి 10 వేళా రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలబడనున్నారు.
Mankind’s toughest test of solidarity, but we will emerge as a stronger race.
Promising to have each other’s backs and to pay it forward. Stay home and stay safe! #CoronavirusLockdown pic.twitter.com/1KujK4Rsjr— Allari Naresh (@allarinaresh) March 26, 2020
>> కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి విరాళాన్ని ప్రకటించిన మెగా స్టార్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి
The lockdown situation while mandatory to deal with the #CoronaCrisis,also adversely impacts the lives of daily wage workers & lower income groups in the country including the #TeluguFilmIndustry.Keeping this in mind I am donating Rs.1 Cr for providing relief to the Film workers.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020
>> సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా సహాయార్థం ఇరు తెలుగు రాష్ట్రాలకి కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
Let's battle the COVID-19 as a nation! I urge everyone to follow the rules put forth by our Government. My deepest gratitude for all your efforts @PMOIndia @TelanganaCMO @KTRTRS @AndhraPradeshCM @ysjagan. 🙏🙏 Humanity will rise and we will win this war! #StayHomeStaySafe pic.twitter.com/csfdtaZPWy
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2020
>> జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరొక 50 లక్షలు డొనేట్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
>> మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి కలిపి 70 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.
Hope this tweet finds you in good health. At this hour of crisis, inspired by @PawanKalyan garu, I want to do my bit by contributing to aid the laudable efforts of our governments…
Hope you all are staying safe at home! @TelanganaCMO @AndhraPradeshCM @PMOIndia @KTRTRS pic.twitter.com/Axnx79gTnI— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2020
>> మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.
>> యంగ్ హీరో నితిన్ ఇరు తెలుగు రాష్ట్రాల సంక్షేమ నిధికి చెరో 10 లక్షలు ఇచ్చారు.
>> స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకి చెరో 5 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.
>> కమెడియన్ అలీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.
>> సూపర్ సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
>> దిల్ రాజు అధినేత అయినా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఇరు తెలుగు రాష్ట్రాలకి చెరొక 10 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.