ఈ విపత్తు సమయంలో టాలీవుడ్ సినీ కార్మికులు కనీసం తినడానికి తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలి బాధలను తీర్చేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి అధ్యక్షతన సీసీసీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసరాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు విరాళాలు ఇచ్చారు. కాని బడా నిర్మాతలం, పెద్ద హీరోల, పెద్ద స్టార్స్ అని చెప్పుకునే వారు మాత్రం విరాళాలు ఇవ్వక పోవడం విడ్డూరం.
తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత సీసీసీకి అయిదు లక్షల విరాళంను ప్రకటించాడు. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వందల కోట్లు పెట్టి సినిమాను నిర్మిస్తాడు. అలాంటి నిర్మాత కేవలం అయిదు లక్షల విరాళం ఇవ్వడం ఏమాత్రం సరి కాదని, ఆయన స్థాయికి కనీసం పాతిక లక్షలు అయినా విరాళంగా ఇవ్వాల్సిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ప్రముఖ దర్శకుడు కూడా తన పారితోషికం విషయంలో తన చిన్న మనసును బయట పెట్టాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడం స్టార్స్ ధర్మం. వారి కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తే బాగుండేది. కాని నిర్మాతలు పేరుకు బడా నిర్మాతలు అయినా విరాళం విషయంలో మాత్రం వారు చాలా చిన్న అన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. వందల కోట్ల బిజినెస్లు చేసే వారు కోటి రూపాయల విరాళం ఇవ్వగలరు. కాని వారు మాత్రం అంత పెద్ద మనసును కనబర్చడం లేదు. ఇప్పుడే ఎవరు ఎలాంటి వారు అనే విషయం అర్థం అవుతుంది.