Switch to English

‘గేమ్ ఛేంజర్’ని మాత్రమే కాదు.. మొత్తంగా తెలుగు సినిమానే చంపేశారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

సినిమా రిలీజ్ అయిన గంటలోనే ‘హెచ్‌డీ’ క్వాలిటీతో ఎలా ‘గేమ్ ఛేంజర్’ లీకైంది.? సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో, కార్లు, బైక్‌లను రిపేర్ చేసే వర్క్ షాపుల్లో.. అక్కడా, ఇక్కడా అని కాదు.. ఎక్కడంటే అక్కడ ‘గేమ్ ఛేంజర్’ సినిమాని పనిగట్టుకుని ఎలా ‘షో’ వేసేశారు.. అదీ ఉచితంగా.?

కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచిన ‘గేమ్ ఛేంజర్’ టీమ్, జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. సుమారు 45 మంది దుర్మార్గులు ముఠాగా ఏర్పడి, ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌ని సినిమా రిలీజ్‌కి ముందే బెదిరించడం మొదలు పెట్టిందట.

పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన ఆ దుర్మార్గుల ముఠా, నిర్మాతల నుంచి ఆ ముఠా కోరుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో, ‘హెచ్‌డీ క్వాలిటీ’ సినిమాని లీక్ చేసేసింది. ఇదంతా రహస్యంగా ఏమీ జరగలేదు.

సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందర, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానులు, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.. ‘సినిమా రిలీజ్ అయిన గంటలోపే హెచ్‌డీ క్వాలిటీలో సినిమాని లీక్ చేసేస్తాం.. అదే మా లక్ష్యం..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు.

సో.. ఇక్కడ నేరానికి పాల్పడ్డదెవరు.? అన్నది సుస్పష్టం. అరెస్టులే తరువాయి.! అయితే, చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయమై ఎంత సీరియస్‌గా వుందన్నదే కీలకం. ఎందుకంటే, సినిమాని రిలీజ్ చేసేసి.. చేతులు దులిపేసుకున్నట్లు తయారైంది పరిస్థితి.

సినిమా రిలీజ్ రోజునే, హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ బయటకు రావడంపై మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థని ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియా నుంచి ఆ వీడియోల్ని తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు కూడా. ఆ మాటకొస్తే నెత్తీనోరూ బాదుకున్నారనడం కరెక్ట్.

అయినాగానీ, నిర్మాత దిల్ రాజు ఈ విషయమై ఇంతవరకు మీడియా ముందుకొచ్చి ఏమీ చెప్పలేదు.

గతంలో.. అంటే, ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలోనూ పైరసీ, వెర్రి తలలు వేసింది. అయితే, ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా వుంది. ఇది సోషల్ మీడియా యుగం. అప్పటికీ ఇప్పటికీ స్మార్ట్ పోన్ల వాడకం ఎక్కువైపోయింది. దాంతో, చేతిలోనే సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

పైరసీ ఓ వైపు, సినిమాపై విపరీతమైన నెగెటివిటీ ఇంకో వైపు. ఓ మీడియా సంస్థకి ఐదు లక్షలు ఆఫర్ చేసి మరీ, సినిమాపై నెగెటివిటీ ప్రచారం చేయాలని కొందరు వ్యక్తులు ప్రయత్నించారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ తరఫున కొందరు, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఇంకొందరు, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో మరికొందరు.. కొన్ని మీడియా సంస్థల్ని లక్షల మొత్తానికి కొనేసి, ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై విపరీతమైన నెగెటివిటీని సృష్టించారు.

నిజానికి, ఈ దెబ్బ కేవలం ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి మాత్రమే కాదు, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకే ఇది పెద్ద దెబ్బ. ఎందుకంటే, ఇది క్యాన్సర్ కంటే తీవ్రమైనది. సినిమా పరిశ్రమ మొత్తాన్నీ పీల్చి పిప్పి చేసేస్తుంది.

అన్నట్టు, సినిమాకి నెగెటివ్ రివ్యూల కోసం కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘రెండున్నర దాటకూడదు’ అని ఓ వైబ్ సైట్‌కి, ఓ రాజకీయ పార్టీ సుమారు ఐదు లక్షల రూపాయలు చెల్లించిందన్నది సినీ పాత్రికేయ వర్గాల్లో వినిపిస్తోన్న గాసిప్. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకీ.. ఇలాగే డబ్బులిచ్చి, ఆ వెబ్‌సైట్‌లో తక్కువ రేటింగ్ వేయించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

రామ్ కష్టానికి రెస్పాన్స్ లేకపోవడం నిరాశాజనకం

రామ్ పొతినేని తన కొత్త సినిమాలో పెట్టిన శ్రద్ధ, శ్రమ, నిబద్ధత మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమా కోసం ఆయన స్క్రిప్ట్ రూపకల్పనలో పాల్గొని, ఒక పాటకు లిరిక్స్ రాసి, అదే పాటను...

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్...

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....

2029 నాటికి ఎపి విద్యలో నెం.1 లక్ష్యం: మంత్రి లోకేష్

పాలకొండలో భామిని ఎపి మోడల్ స్కూలులో జరిగిన మెగా పిటిఎం 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలపై కొంతమందిలో...

మంగళగిరిలో లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్‌లో వినతుల వర్షం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన 76వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి ఒక్కరినీ...